Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:54 PM

భాషా నాయక్ తండలో అట్టహాసంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

భాషా నాయక్ తండలో అట్టహాసంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

భాషా నాయక్ తండలో అట్టహాసంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
January 26, 2026 01:09 PM 159 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు భాషా నాయక్ తండలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఉదయం నుంచే తండ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొనగా, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ నిర్మాణానికి ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకుని ఘన నివాళులు అర్పించారు.వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహాగ్రంథమని తెలిపారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కస్పరాజు రమేష్, భూక్య మహేష్, నిరుడు విజయకుమార్, బాలెమ్ ల ఉప్పలయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు. యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా వేడుకలను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసిన సిందం సైదులుకు నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో భాషా నాయక్ తండలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News