భాషా నాయక్ తండలో అట్టహాసంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
భాషా నాయక్ తండలో అట్టహాసంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు భాషా నాయక్ తండలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఉదయం నుంచే తండ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొనగా, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ నిర్మాణానికి ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకుని ఘన నివాళులు అర్పించారు.వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహాగ్రంథమని తెలిపారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కస్పరాజు రమేష్, భూక్య మహేష్, నిరుడు విజయకుమార్, బాలెమ్ ల ఉప్పలయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు. యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా వేడుకలను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసిన సిందం సైదులుకు నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో భాషా నాయక్ తండలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి