Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:23 PM

భారత్–అమెరికా వ్యవసాయ, వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిద్దాం

భారత్–అమెరికా వ్యవసాయ, వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిద్దాం

భారత్–అమెరికా వ్యవసాయ, వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిద్దాం
February 12, 2026 05:03 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నాలుగు కార్మిక చట్టాలు రద్దు చేయాలి – స్వామీనాథన్ సిఫారసులు అమలు చేయాలి

కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న వ్యవసాయ, వాణిజ్య ఒప్పందం దేశ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించేలా ఉందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా నాయకుడు తిమ్మిడి హనుమంతరావు విమర్శించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా దమ్మాయిగూడెం గ్రామంలో నిర్వహించిన రాస్తారోకోలో పాల్గొని ఆయన మాట్లాడారు.అమెరికాలో పండించిన పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, పాలు తదితర ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని సున్నాకు తగ్గించడం ద్వారా భారత రైతులను మార్కెట్ నుంచి తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. అక్కడి రైతులకు భారీ రాయితీలు ఇస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తుండగా, మన దేశంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, స్వామీనాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయడం లేదని ఆరోపించారు.

దేశంలో దాదాపు ఇరవై కోట్ల రైతు కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయని, రోజుకు సగటున ముప్పై ఒకరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితుల్లో ఈ ఒప్పందం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని, కొత్త ఉపాధి మార్పు చట్టాన్ని ఎత్తివేసి పాత చట్టం ప్రకారం ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. దానికి కావలసిన వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించాలని కోరారు.విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు, నాలుగు కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, మహిళా సంఘాలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, విద్యార్థులు, యువత, మేధావులు సహా అన్ని వర్గాల ప్రజలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా దమ్మాయిగూడెం గ్రామంలో గంటపాటు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో రేపాకుల శివలింగం, సోమనపల్లి వెంకటేశ్వర్లు, గొడుగు విజయ్, మీగడ సైదులు, శెట్టి నరసయ్య, పమ్మి జగదీష్, అంజి, ఈడబోయిన వెంకన్న, పేరం నాగయ్య, భాష, తిమ్మిడి రఘుబాబు, అంగిరేకుల వీరబాబు, సక్రం, సురేష్, నాగరాజ్, బిక్షం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News