Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:54 PM

భారత్–అమెరికా వ్యవసాయ, వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిద్దాం

భారత్–అమెరికా వ్యవసాయ, వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిద్దాం

భారత్–అమెరికా వ్యవసాయ, వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిద్దాం
February 12, 2026 05:03 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నాలుగు కార్మిక చట్టాలు రద్దు చేయాలి – స్వామీనాథన్ సిఫారసులు అమలు చేయాలి

కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న వ్యవసాయ, వాణిజ్య ఒప్పందం దేశ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించేలా ఉందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా నాయకుడు తిమ్మిడి హనుమంతరావు విమర్శించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా దమ్మాయిగూడెం గ్రామంలో నిర్వహించిన రాస్తారోకోలో పాల్గొని ఆయన మాట్లాడారు.అమెరికాలో పండించిన పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, పాలు తదితర ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని సున్నాకు తగ్గించడం ద్వారా భారత రైతులను మార్కెట్ నుంచి తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. అక్కడి రైతులకు భారీ రాయితీలు ఇస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తుండగా, మన దేశంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, స్వామీనాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయడం లేదని ఆరోపించారు.

దేశంలో దాదాపు ఇరవై కోట్ల రైతు కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయని, రోజుకు సగటున ముప్పై ఒకరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితుల్లో ఈ ఒప్పందం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని, కొత్త ఉపాధి మార్పు చట్టాన్ని ఎత్తివేసి పాత చట్టం ప్రకారం ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. దానికి కావలసిన వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించాలని కోరారు.విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు, నాలుగు కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, మహిళా సంఘాలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, విద్యార్థులు, యువత, మేధావులు సహా అన్ని వర్గాల ప్రజలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా దమ్మాయిగూడెం గ్రామంలో గంటపాటు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో రేపాకుల శివలింగం, సోమనపల్లి వెంకటేశ్వర్లు, గొడుగు విజయ్, మీగడ సైదులు, శెట్టి నరసయ్య, పమ్మి జగదీష్, అంజి, ఈడబోయిన వెంకన్న, పేరం నాగయ్య, భాష, తిమ్మిడి రఘుబాబు, అంగిరేకుల వీరబాబు, సక్రం, సురేష్, నాగరాజ్, బిక్షం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News