బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజుల పని దినం కల్పించాలి బైక్ ర్యాలీ
బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజుల పని దినం కల్పించాలి బైక్ ర్యాలీ
Biksham Goud
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
వారానికి ఐదు రోజుల పని దినం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా సాగిన ఈ ర్యాలీ నగర ప్రజల దృష్టిని ఆకర్షించింది.ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు అధిక పనిభారం, ఒత్తిడితో పనిచేస్తున్నారని, కుటుంబ జీవనానికి, ఆరోగ్యానికి ఐదు రోజుల పని విధానం అవసరమని తెలిపారు. ఇతర రంగాల్లో ఇప్పటికే ఐదు రోజుల పని విధానం అమలులో ఉండగా, బ్యాంకింగ్ రంగంలోనూ అదే విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ర్యాలీ అనంతరం ఉద్యోగులు ధర్నా నిర్వహించి తమ డిమాండ్లను నినాదాల రూపంలో వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి