Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:22 PM

బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజుల పని దినం కల్పించాలి బైక్ ర్యాలీ

బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజుల పని దినం కల్పించాలి బైక్ ర్యాలీ

బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజుల పని దినం కల్పించాలి  బైక్ ర్యాలీ
January 27, 2026 02:28 PM 164 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

వారానికి ఐదు రోజుల పని దినం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా సాగిన ఈ ర్యాలీ నగర ప్రజల దృష్టిని ఆకర్షించింది.ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు అధిక పనిభారం, ఒత్తిడితో పనిచేస్తున్నారని, కుటుంబ జీవనానికి, ఆరోగ్యానికి ఐదు రోజుల పని విధానం అవసరమని తెలిపారు. ఇతర రంగాల్లో ఇప్పటికే ఐదు రోజుల పని విధానం అమలులో ఉండగా, బ్యాంకింగ్ రంగంలోనూ అదే విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ర్యాలీ అనంతరం ఉద్యోగులు ధర్నా నిర్వహించి తమ డిమాండ్లను నినాదాల రూపంలో వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News