Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:45 AM

బ్రిటిష్ సామ్రాజ్యానికి వణుకు పుట్టించిన వీరుడు సుభాష్ చంద్రబోస్

బ్రిటిష్ సామ్రాజ్యానికి వణుకు పుట్టించిన వీరుడు సుభాష్ చంద్రబోస్

బ్రిటిష్ సామ్రాజ్యానికి వణుకు పుట్టించిన వీరుడు సుభాష్ చంద్రబోస్
January 23, 2026 03:30 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పరాక్రమ దివస్ సందర్భంగా రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేతాజీ జయంతి ఘనోత్సవం

రామన్నపేటస్థానికం ప్రధాన ప్రతినిధి

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అగ్నిపథం ఎంచుకున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దివస్ సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా జీవితాన్నే త్యాగం చేసిన అపూర్వ దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. భారత జాతీయ కాంగ్రెస్‌కు రెండుసార్లు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినప్పటికీ, అనంతరం ఆజాద్ హింద్ ఫౌజును స్థాపించి బ్రిటిష్ ప్రభుత్వంపై యుద్ధప్రకటన చేసిన ధైర్యశాలి నేతాజీ అని కొనియాడారు.

చరిత్ర విభాగాధిపతి డాక్టర్ డి. కిషన్ మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా తన ఐసిఎస్ పదవిని త్యజించి, ఆజాద్ హింద్ ఫౌజును స్థాపించడం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్య పునాదులకే సవాల్ విసిరిన మహనీయుడని తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ ఛాన్సలర్ అడాల్ఫ్ హిట్లర్‌ను కలుసుకుని భారత విముక్తికి మద్దతు కోరిన ఏకైక భారతీయుడు నేతాజీ అని పేర్కొన్నారు. సిద్ధాంత పరంగా గాంధీజీతో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఆజాద్ హింద్ ఫౌజ్ రేడియో ప్రసంగంలో మహాత్మా గాంధీని తొలిసారిగా ‘జాతిపిత’గా సంబోధించిన విశాల హృదయుడని వివరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, అధ్యాపకులు డాక్టర్ జి. సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, ఎం. అనిత, డాక్టర్ పి. బ్రహ్మం, డాక్టర్ రాచమళ్ళ శ్రీను, టి. శ్రీనివాస్, అమరేందర్, నరేష్, ఆంజనేయులు, రవి, రాధికలతో పాటు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News