బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన నేతాజీ యువతకు శాశ్వత ఆదర్శం
బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన నేతాజీ యువతకు శాశ్వత ఆదర్శం
స్థానికం బృందం
పెద్దకాపర్తి గ్రామంలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి
చిట్యాలస్థానికం ప్రధాన ప్రతినిధి
చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని గ్రంథాలయం వద్ద సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అసమాన వీరుడు సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. తనదైన శైలిలో ఆజాద్ హింద్ ఫౌజును స్థాపించి భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహానేత అని తెలిపారు. త్యాగం, ధైర్యం, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన నేతాజీ నేటి యువతరానికి ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్మాస్టర్ తాటి చంద్రమౌళి, వార్డు సభ్యులు మర్రి హరీష్ రెడ్డి, కురు యాదయ్య, నీలకంఠం లింగస్వామినూతి, వెంకటేశం, ఆవుల జానయ్య, గుండెబోయిన నరసింహ, గంట్ల పుల్లారెడ్డి పాల్గొని నేతాజీకి ఘన నివాళులు అర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి