బరఖత్ గూడెం వెంకటేశ్వర స్వామి ఆలయం లో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు...
బరఖత్ గూడెం వెంకటేశ్వర స్వామి ఆలయం లో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు...
Harish HS
ఉగాది సందర్భంగా బరఖత్ గూడెం వెంకటేశ్వర స్వామి ఆలయం లో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు...
మునగాల మండలం బరఖత్ గూడెం లోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఉత్తర ద్వారం కలిగి ఉన్న చారిత్రాత్మకమైన ఆలయం అని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించిన లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమం లో డీఎస్పీ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఆధ్మాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. పండుగలన్నీ ప్రజల సుఖ సంతోషాలకు అనాదిగా వస్తున్నాయన్నారు. పండుగల సంస్కృతి సంప్రదాయాలను మరిచి పోవద్దన్నారు. పరాభనామ సంవత్సరం ప్రజలకు విజయాలు సాధించి పెట్టాలన్నారు. ప్రజలకు నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్,దేవాలయం చైర్మన్ శ్రీనివాస్, ఆలయ పూజారి, స్థానిక భక్తులు ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి