Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:42 AM

బాలికల హైస్కూల్‌కు సొంత ఖర్చులతో సున్నం, దీపాల ఏర్పాటు.ఉపసర్పంచ్,8 వ వార్డు సభ్యులు

బాలికల హైస్కూల్‌కు సొంత ఖర్చులతో సున్నం, దీపాల ఏర్పాటు.ఉపసర్పంచ్,8 వ వార్డు సభ్యులు

బాలికల హైస్కూల్‌కు సొంత ఖర్చులతో సున్నం, దీపాల ఏర్పాటు.ఉపసర్పంచ్,8 వ వార్డు సభ్యులు
January 25, 2026 07:31 PM 467 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బాలికల చదువుకు వెలుగు పంచిన సేవా హస్తం

స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట పట్టణంలోని బాలికల హైస్కూల్ గత కొన్నేళ్లుగా సున్నం వేయకపోవడంతో శిదిలావస్థలో దర్శనమిచ్చింది. పాఠశాల భవనం పరిస్థితిని గమనించిన స్థానిక ప్రజాప్రతినిధులు, మాటలకే పరిమితం కాకుండా పనితో స్పందించారు.పాఠశాల సందర్శన సమయంలో హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయులు సున్నం వేయించాలని కోరగా, పట్టణ ఉపసర్పంచ్ మోటే రమేష్, ఎనిమిదవ వార్డు సభ్యులు అబ్దుల్ వహిద్ మహమ్మద్ (అంజాద్) తమ సొంత ఖర్చులతో పాఠశాల భవనానికి సున్నం వేయించారు. దీంతో పాఠశాల రూపురేఖలు మారి, విద్యార్థినులకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది.

అదేవిధంగా పదవ తరగతి విద్యార్థినులు రాత్రి తరగతులకు వచ్చే సమయంలో చీకటిలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలియజేయగానే, పాఠశాల పరిసరాల్లో దీపాల ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టారు. దీపాల వెలుగుతో విద్యార్థినులకు భద్రత, సౌకర్యం మరింత మెరుగుపడిందని ఉపాధ్యాయులు తెలిపారు.

ప్రజాప్రతినిధుల ఈ సేవాభావానికి పాఠశాల యాజమాన్యం, విద్యార్థినులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన ఈ చర్య ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News