బాలికల భద్రతే సమాజానికి దిశ జాతీయ బాలిక దినోత్సవంలో సంకల్ప నినాదం
బాలికల భద్రతే సమాజానికి దిశ జాతీయ బాలిక దినోత్సవంలో సంకల్ప నినాదం
స్థానికం బృందం
రాయగిరి, స్థానికం ప్రధాన ప్రతినిధి
బాలికల రక్షణ, హక్కులు, విద్య పట్ల సమాజం మొత్తం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని జిల్లా సంక్షేమ అధికారి నరసింహ రావు పిలుపునిచ్చారు. మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవాన్ని అర్థవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ బాల బాలికలకు చట్టపరమైన హక్కులు, రక్షణ విధానాలు, విద్య ప్రాముఖ్యతను వివరించారు. మంచి స్పర్శ–చెడుస్పర్శపై అవగాహన కలిగి ఉండాలని, బాలికలను పుట్టనిద్దాం, కాపాడిద్దాం, చదివిద్దాం, ఎదిగేలా చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేసి బాలికల చదువుకు ప్రోత్సాహం అందించారు. బాలికలు భయం లేకుండా ఎదిగే వాతావరణం ఏర్పడితేనే సమాజం బలపడుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి శైలజ, బాలికా రక్షణ సమన్వయకర్త అనంతలక్ష్మీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అండాలు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, పర్యవేక్షకులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సాధికారత బృంద సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి