Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 02:07 PM

బాలిక హక్కులే భవిష్యత్తుకు భరోసా జాతీయ బాలిక దినోత్సవంలో చట్టపరమైన అవగాహన

బాలిక హక్కులే భవిష్యత్తుకు భరోసా జాతీయ బాలిక దినోత్సవంలో చట్టపరమైన అవగాహన

బాలిక హక్కులే భవిష్యత్తుకు భరోసా జాతీయ బాలిక దినోత్సవంలో చట్టపరమైన అవగాహన
24-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, జనవరి 24:

బాలికల హక్కుల పరిరక్షణే సమాజ అభివృద్ధికి పునాది అన్న సందేశంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో జాతీయ బాలిక దినోత్సవాన్ని అర్థవంతంగా నిర్వహించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో భువనగిరిలోని ప్రభుత్వ షెడ్యూల్ కులాల అభివృద్ధి బాలికల వసతి గృహంలో అవగాహన కార్యక్రమం జరిగింది.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవిలత సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి. నాగేంద్రమ్మ, సరిత బాలికలకు చట్టపరమైన హక్కులు, సంరక్షణ, బాల్య వివాహ నిషేధం, విద్య హక్కుల ప్రాముఖ్యత, ప్రభుత్వ పథకాలపై స్పష్టంగా వివరించారు. బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును అంధకారంలోకి నెడతాయని హెచ్చరించారు.వసతి గృహ సంక్షేమ అధికారి ఇందిర మాట్లాడుతూ విద్యార్థినీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారి చదువు, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

బాలికలు తమ హక్కులపై అవగాహన కలిగి ధైర్యంగా ముందుకు సాగితేనే సమాజం సుస్థిరంగా అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థినీలు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

బాలిక హక్కులే భవిష్యత్తుకు భరోసా జాతీయ బాలిక దినోత్సవంలో చట్టపరమైన అవగాహన

Article Image

భువనగిరి, జనవరి 24:

బాలికల హక్కుల పరిరక్షణే సమాజ అభివృద్ధికి పునాది అన్న సందేశంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో జాతీయ బాలిక దినోత్సవాన్ని అర్థవంతంగా నిర్వహించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో భువనగిరిలోని ప్రభుత్వ షెడ్యూల్ కులాల అభివృద్ధి బాలికల వసతి గృహంలో అవగాహన కార్యక్రమం జరిగింది.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవిలత సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి. నాగేంద్రమ్మ, సరిత బాలికలకు చట్టపరమైన హక్కులు, సంరక్షణ, బాల్య వివాహ నిషేధం, విద్య హక్కుల ప్రాముఖ్యత, ప్రభుత్వ పథకాలపై స్పష్టంగా వివరించారు. బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును అంధకారంలోకి నెడతాయని హెచ్చరించారు.వసతి గృహ సంక్షేమ అధికారి ఇందిర మాట్లాడుతూ విద్యార్థినీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారి చదువు, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

బాలికలు తమ హక్కులపై అవగాహన కలిగి ధైర్యంగా ముందుకు సాగితేనే సమాజం సుస్థిరంగా అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థినీలు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News