Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:25 PM

బాలిక హక్కులే భవిష్యత్తుకు భరోసా జాతీయ బాలిక దినోత్సవంలో చట్టపరమైన అవగాహన

బాలిక హక్కులే భవిష్యత్తుకు భరోసా జాతీయ బాలిక దినోత్సవంలో చట్టపరమైన అవగాహన

బాలిక హక్కులే భవిష్యత్తుకు భరోసా జాతీయ బాలిక దినోత్సవంలో చట్టపరమైన అవగాహన
January 24, 2026 10:09 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, జనవరి 24:

బాలికల హక్కుల పరిరక్షణే సమాజ అభివృద్ధికి పునాది అన్న సందేశంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో జాతీయ బాలిక దినోత్సవాన్ని అర్థవంతంగా నిర్వహించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో భువనగిరిలోని ప్రభుత్వ షెడ్యూల్ కులాల అభివృద్ధి బాలికల వసతి గృహంలో అవగాహన కార్యక్రమం జరిగింది.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవిలత సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి. నాగేంద్రమ్మ, సరిత బాలికలకు చట్టపరమైన హక్కులు, సంరక్షణ, బాల్య వివాహ నిషేధం, విద్య హక్కుల ప్రాముఖ్యత, ప్రభుత్వ పథకాలపై స్పష్టంగా వివరించారు. బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును అంధకారంలోకి నెడతాయని హెచ్చరించారు.వసతి గృహ సంక్షేమ అధికారి ఇందిర మాట్లాడుతూ విద్యార్థినీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారి చదువు, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

బాలికలు తమ హక్కులపై అవగాహన కలిగి ధైర్యంగా ముందుకు సాగితేనే సమాజం సుస్థిరంగా అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థినీలు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News