బాలిక హక్కులే భవిష్యత్తుకు భరోసా జాతీయ బాలిక దినోత్సవంలో చట్టపరమైన అవగాహన
బాలిక హక్కులే భవిష్యత్తుకు భరోసా జాతీయ బాలిక దినోత్సవంలో చట్టపరమైన అవగాహన
స్థానికం బృందం
భువనగిరి, జనవరి 24:
బాలికల హక్కుల పరిరక్షణే సమాజ అభివృద్ధికి పునాది అన్న సందేశంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో జాతీయ బాలిక దినోత్సవాన్ని అర్థవంతంగా నిర్వహించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో భువనగిరిలోని ప్రభుత్వ షెడ్యూల్ కులాల అభివృద్ధి బాలికల వసతి గృహంలో అవగాహన కార్యక్రమం జరిగింది.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవిలత సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి. నాగేంద్రమ్మ, సరిత బాలికలకు చట్టపరమైన హక్కులు, సంరక్షణ, బాల్య వివాహ నిషేధం, విద్య హక్కుల ప్రాముఖ్యత, ప్రభుత్వ పథకాలపై స్పష్టంగా వివరించారు. బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును అంధకారంలోకి నెడతాయని హెచ్చరించారు.వసతి గృహ సంక్షేమ అధికారి ఇందిర మాట్లాడుతూ విద్యార్థినీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారి చదువు, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
బాలికలు తమ హక్కులపై అవగాహన కలిగి ధైర్యంగా ముందుకు సాగితేనే సమాజం సుస్థిరంగా అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థినీలు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి