PRINT TIME: April 10, 2026 12:10 PM
బ్లాక్చెయిన్తో సర్టిఫికెట్లలో పారదర్శకత.పుష్పా చక్రపాణి
బ్లాక్చెయిన్తో సర్టిఫికెట్లలో పారదర్శకత.పుష్పా చక్రపాణి
January 21, 2026 04:42 PM
21 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్,స్థానికం ప్రధాన ప్రతినిధి
అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బ్లాక్చెయిన్ టెక్నాలజీ అమలుతో విద్యార్థుల సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి తెలిపారు. సీఎస్టిడి ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్చెయిన్ టెక్నాలజీ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
బ్లాక్చెయిన్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్లను వేగంగా జారీ చేయడంతో పాటు వాటి ధృవీకరణ, ప్రామాణికత నిర్ధారణ సులభమవుతుందన్నారు. నకిలీ సర్టిఫికెట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. వై. విజయకృష్ణా రెడ్డి, సీఎస్టిడి డైరెక్టర్ ప్రొ. పి. వెంకటరమణతో పాటు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి