Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:48 PM

బహిరంగ సభను జయప్రదం చేయాలి: సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ

బహిరంగ సభను జయప్రదం చేయాలి: సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ

బహిరంగ సభను జయప్రదం చేయాలి: సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ
January 11, 2026 03:13 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిపిఐ శతాబ్ది సభకు పిలుపు: ఖమ్మంలో లక్షలాది మందితో బహిరంగ సభ

రామన్న పేట స్థానికం ప్రధాన ప్రతినిధి

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18న ఖమ్మం పట్టణంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సిపిఐ రామన్నపేట మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ తెలిపారు. ఈ సందర్భంగా రామన్నపేట పట్టణ కేంద్రంలో గోడపత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ, గత వందేళ్లుగా అనేక సవాళ్లు ఎదురైనా ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేసిన ఘన చరిత్ర సిపిఐకే దక్కుతుందని అన్నారు. భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తికోసం జరిగిన ఉద్యమాల్లో సిపిఐ కీలక పాత్ర పోషించిందని, భూమిలేని నిరుపేదలకు భూములు పంచిన ఘనత పార్టీదేనని పేర్కొన్నారు. ఎందరో అమరవీరుల త్యాగఫలమే ఈ శతజయంతి ముగింపు ఉత్సవాలుగా నిలుస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, మండల సహాయ కార్యదర్శి రామచంద్రం, పట్టణ అధ్యక్షుడు రచ్చ యాదగిరి, సీనియర్ నాయకులు బాలగోని మల్లయ్య, ఊట్కూరి భగవంత, గంగాపురం వెంకటయ్య, గంగాపురం యాదయ్య, వీరమల్ల ముత్తయ్య, సంగిశెట్టి పాండు, ఊట్కూరి కృష్ణ, ఎర్ర బిక్షపతి, ఏనూతుల రమేష్, వీసం గాలయ్య, సిహెచ్ మల్లయ్య, రచ్చ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News