Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:27 AM

బహిరంగ సభను జయప్రదం చేయాలి: సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ

బహిరంగ సభను జయప్రదం చేయాలి: సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ

బహిరంగ సభను జయప్రదం చేయాలి: సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ
January 11, 2026 03:13 PM 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిపిఐ శతాబ్ది సభకు పిలుపు: ఖమ్మంలో లక్షలాది మందితో బహిరంగ సభ

రామన్న పేట స్థానికం ప్రధాన ప్రతినిధి

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18న ఖమ్మం పట్టణంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సిపిఐ రామన్నపేట మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ తెలిపారు. ఈ సందర్భంగా రామన్నపేట పట్టణ కేంద్రంలో గోడపత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ, గత వందేళ్లుగా అనేక సవాళ్లు ఎదురైనా ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేసిన ఘన చరిత్ర సిపిఐకే దక్కుతుందని అన్నారు. భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తికోసం జరిగిన ఉద్యమాల్లో సిపిఐ కీలక పాత్ర పోషించిందని, భూమిలేని నిరుపేదలకు భూములు పంచిన ఘనత పార్టీదేనని పేర్కొన్నారు. ఎందరో అమరవీరుల త్యాగఫలమే ఈ శతజయంతి ముగింపు ఉత్సవాలుగా నిలుస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, మండల సహాయ కార్యదర్శి రామచంద్రం, పట్టణ అధ్యక్షుడు రచ్చ యాదగిరి, సీనియర్ నాయకులు బాలగోని మల్లయ్య, ఊట్కూరి భగవంత, గంగాపురం వెంకటయ్య, గంగాపురం యాదయ్య, వీరమల్ల ముత్తయ్య, సంగిశెట్టి పాండు, ఊట్కూరి కృష్ణ, ఎర్ర బిక్షపతి, ఏనూతుల రమేష్, వీసం గాలయ్య, సిహెచ్ మల్లయ్య, రచ్చ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News