Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:37 AM

బహిరంగ సభను జయప్రదం చేయాలి: సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ

బహిరంగ సభను జయప్రదం చేయాలి: సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ

బహిరంగ సభను జయప్రదం చేయాలి: సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ
January 11, 2026 03:13 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిపిఐ శతాబ్ది సభకు పిలుపు: ఖమ్మంలో లక్షలాది మందితో బహిరంగ సభ

రామన్న పేట స్థానికం ప్రధాన ప్రతినిధి

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18న ఖమ్మం పట్టణంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సిపిఐ రామన్నపేట మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ తెలిపారు. ఈ సందర్భంగా రామన్నపేట పట్టణ కేంద్రంలో గోడపత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ, గత వందేళ్లుగా అనేక సవాళ్లు ఎదురైనా ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేసిన ఘన చరిత్ర సిపిఐకే దక్కుతుందని అన్నారు. భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తికోసం జరిగిన ఉద్యమాల్లో సిపిఐ కీలక పాత్ర పోషించిందని, భూమిలేని నిరుపేదలకు భూములు పంచిన ఘనత పార్టీదేనని పేర్కొన్నారు. ఎందరో అమరవీరుల త్యాగఫలమే ఈ శతజయంతి ముగింపు ఉత్సవాలుగా నిలుస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, మండల సహాయ కార్యదర్శి రామచంద్రం, పట్టణ అధ్యక్షుడు రచ్చ యాదగిరి, సీనియర్ నాయకులు బాలగోని మల్లయ్య, ఊట్కూరి భగవంత, గంగాపురం వెంకటయ్య, గంగాపురం యాదయ్య, వీరమల్ల ముత్తయ్య, సంగిశెట్టి పాండు, ఊట్కూరి కృష్ణ, ఎర్ర బిక్షపతి, ఏనూతుల రమేష్, వీసం గాలయ్య, సిహెచ్ మల్లయ్య, రచ్చ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News