అత్యధిక దిగుబడినిచ్చే 'AK-56' వరి రకంతో లాభాలు
అత్యధిక దిగుబడినిచ్చే 'AK-56' వరి రకంతో లాభాలు
K.RAVI
వేములకొండలో క్షేత్ర ప్రదర్శన.. హర్షం వ్యక్తం చేసిన రైతులు
రైతులు ఆధునిక వరి వంగడాలను సాగు చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆదిత్య సీడ్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. సోమవారం వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో రైతు మిత్ర ట్రేడర్స్ ఆధ్వర్యంలో అదిత్య వారి AK -56 వరి రకంపై క్షేత్ర స్థాయి రైతు సమావేశం నిర్వహించారు. స్థానిక రైతు కందాటి మల్లారెడ్డి పొలంలో సాగు చేసిన ఈ పంటను సుమారు 100 మందికి పైగా రైతులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నాణ్యమైన దిగుబడి.. రైతు సంతోషం
ఈ సందర్భంగా క్షేత్ర యజమాని మల్లారెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ ఏడాది సాగు చేసిన AK -56 వరి రకం అద్భుతమైన దిగుబడిని ఇస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. గింజ గట్టిగా ఉండటంతో పాటు, చీడపీడలను తట్టుకునే శక్తి ఈ రకానికి ఉందని, తోటి రైతులు కూడా ఈ వంగడాన్ని ఎంచుకోవడం లాభదాయకమని సూచించారు.ఈ కార్యక్రమంలో కంపెనీ రీజినల్ మేనేజర్ మట్టపల్లి, రైతు మిత్ర ట్రేడర్స్ అధినేత ఆకుల వెంకన్న, సేల్స్ ఆఫీసర్ శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. AK-56 వంగడం నాణ్యతలో మేలైనదని వివరించారు. తక్కువ నీటి వినియోగంతో, ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలకడైన దిగుబడిని ఇస్తుందని తెలిపారు.రైతులకు అవసరమైన సలహాలు, సూచనలను ఎప్పటికప్పుడు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు పాల్గొని పంట పనితీరును అడిగి తెలుసుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి