Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు భద్రతపై గ్రామసభ — ప్రజల జాగ్రత్తలే ప్రాణరక్షణకు మార్గం కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 03:27 PM

అత్యధిక దిగుబడినిచ్చే 'AK-56' వరి రకంతో లాభాలు

అత్యధిక దిగుబడినిచ్చే 'AK-56' వరి రకంతో లాభాలు

అత్యధిక దిగుబడినిచ్చే 'AK-56' వరి రకంతో లాభాలు
April 13, 2026 01:42 PM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వేములకొండలో క్షేత్ర ప్రదర్శన.. హర్షం వ్యక్తం చేసిన రైతులు

రైతులు ఆధునిక వరి వంగడాలను సాగు చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆదిత్య సీడ్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. సోమవారం వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో రైతు మిత్ర ట్రేడర్స్ ఆధ్వర్యంలో అదిత్య వారి AK -56 వరి రకంపై క్షేత్ర స్థాయి రైతు సమావేశం నిర్వహించారు. స్థానిక రైతు కందాటి మల్లారెడ్డి పొలంలో సాగు చేసిన ఈ పంటను సుమారు 100 మందికి పైగా రైతులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

నాణ్యమైన దిగుబడి.. రైతు సంతోషం

ఈ సందర్భంగా క్షేత్ర యజమాని మల్లారెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ ఏడాది సాగు చేసిన AK -56 వరి రకం అద్భుతమైన దిగుబడిని ఇస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. గింజ గట్టిగా ఉండటంతో పాటు, చీడపీడలను తట్టుకునే శక్తి ఈ రకానికి ఉందని, తోటి రైతులు కూడా ఈ వంగడాన్ని ఎంచుకోవడం లాభదాయకమని సూచించారు.ఈ కార్యక్రమంలో కంపెనీ రీజినల్ మేనేజర్ మట్టపల్లి, రైతు మిత్ర ట్రేడర్స్ అధినేత ఆకుల వెంకన్న, సేల్స్ ఆఫీసర్ శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ​AK-56 వంగడం నాణ్యతలో మేలైనదని వివరించారు. ​తక్కువ నీటి వినియోగంతో, ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలకడైన దిగుబడిని ఇస్తుందని తెలిపారు.రైతులకు అవసరమైన సలహాలు, సూచనలను ఎప్పటికప్పుడు అందిస్తామని భరోసా ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు పాల్గొని పంట పనితీరును అడిగి తెలుసుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News