ఆరోగ్యమే మహాభాగ్యం… ప్రజలకు అవగాహన కల్పించిన వైద్యులు
ఆరోగ్యమే మహాభాగ్యం… ప్రజలకు అవగాహన కల్పించిన వైద్యులు
Krishna
సదాశివపేట పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళల ఆరోగ్య రక్షణ లక్ష్యంగా హెచ్పీవీ ఆరోగ్య అవగాహన శిబిరం ఘనంగా నిర్వహించారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే హెచ్పీవీ టీకా ప్రాముఖ్యత, ఆరోగ్య పరీక్షల అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ అంజమ్మ, 13వ వార్డు కౌన్సిలర్ ఎర్ర విశాలి నాగరాజు గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య సేవలు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలను వారు స్వయంగా పరిశీలించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ అంజమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా మహిళలు సమయానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చని తెలిపారు. ప్రభుత్వం మరియు సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కౌన్సిలర్ ఎర్ర విశాలి నాగరాజు గౌడ్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా నిరంతరం కృషి చేస్తామని, మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఇటువంటి అవగాహన శిబిరాలు మరిన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.శిబిరంలో వైద్యులు గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు, నివారణ మార్గాలు, హెచ్పీవీ టీకా ప్రయోజనాలపై మహిళలకు వివరించారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి