Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:32 AM

ఆరోగ్యమే మహాభాగ్యం… ప్రజలకు అవగాహన కల్పించిన వైద్యులు

ఆరోగ్యమే మహాభాగ్యం… ప్రజలకు అవగాహన కల్పించిన వైద్యులు

ఆరోగ్యమే మహాభాగ్యం… ప్రజలకు అవగాహన కల్పించిన వైద్యులు
May 19, 2026 08:37 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళల ఆరోగ్య రక్షణ లక్ష్యంగా హెచ్‌పీవీ ఆరోగ్య అవగాహన శిబిరం ఘనంగా నిర్వహించారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే హెచ్‌పీవీ టీకా ప్రాముఖ్యత, ఆరోగ్య పరీక్షల అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ అంజమ్మ, 13వ వార్డు కౌన్సిలర్ ఎర్ర విశాలి నాగరాజు గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య సేవలు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలను వారు స్వయంగా పరిశీలించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ అంజమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా మహిళలు సమయానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చని తెలిపారు. ప్రభుత్వం మరియు సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కౌన్సిలర్ ఎర్ర విశాలి నాగరాజు గౌడ్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా నిరంతరం కృషి చేస్తామని, మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఇటువంటి అవగాహన శిబిరాలు మరిన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.శిబిరంలో వైద్యులు గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు, నివారణ మార్గాలు, హెచ్‌పీవీ టీకా ప్రయోజనాలపై మహిళలకు వివరించారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News