ఆరోగ్యమే మహాభాగ్యం… మార్నింగ్ వాకింగ్ అలవాటు చేసుకోండి
ఆరోగ్యమే మహాభాగ్యం… మార్నింగ్ వాకింగ్ అలవాటు చేసుకోండి
Komidala Mahender reddy
నేటి ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించాలంటే మార్నింగ్ వాకింగ్ను తప్పనిసరి అలవాటు చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ పందిరి గీత ప్రజలకు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం పట్టణ కేంద్రంలోని హైస్కూల్ సమీపంలోని వనిపాకల రోడ్డుపై నిర్వహించిన 1కే రన్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ పందిరి గీత మాట్లాడుతూ, కంప్యూటర్ యుగంలో జీవనశైలి మార్పుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే కొంతసేపు మార్నింగ్ వాకింగ్ చేస్తే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు అనేక వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు.
ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని భాగంగా చేసుకోవాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, అంగన్వాడీ సిబ్బంది, పట్టణ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి