Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:39 AM

ఆరోగ్యమే మహాభాగ్యం… మార్నింగ్ వాకింగ్ అలవాటు చేసుకోండి

ఆరోగ్యమే మహాభాగ్యం… మార్నింగ్ వాకింగ్ అలవాటు చేసుకోండి

ఆరోగ్యమే మహాభాగ్యం… మార్నింగ్ వాకింగ్ అలవాటు చేసుకోండి
09-03-2026 208 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నేటి ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించాలంటే మార్నింగ్ వాకింగ్‌ను తప్పనిసరి అలవాటు చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ పందిరి గీత ప్రజలకు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం పట్టణ కేంద్రంలోని హైస్కూల్ సమీపంలోని వనిపాకల రోడ్డుపై నిర్వహించిన 1కే రన్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ పందిరి గీత మాట్లాడుతూ, కంప్యూటర్ యుగంలో జీవనశైలి మార్పుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే కొంతసేపు మార్నింగ్ వాకింగ్ చేస్తే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు అనేక వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు.

ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని భాగంగా చేసుకోవాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, అంగన్వాడీ సిబ్బంది, పట్టణ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆరోగ్యమే మహాభాగ్యం… మార్నింగ్ వాకింగ్ అలవాటు చేసుకోండి

Article Image

నేటి ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించాలంటే మార్నింగ్ వాకింగ్‌ను తప్పనిసరి అలవాటు చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ పందిరి గీత ప్రజలకు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం పట్టణ కేంద్రంలోని హైస్కూల్ సమీపంలోని వనిపాకల రోడ్డుపై నిర్వహించిన 1కే రన్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ పందిరి గీత మాట్లాడుతూ, కంప్యూటర్ యుగంలో జీవనశైలి మార్పుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే కొంతసేపు మార్నింగ్ వాకింగ్ చేస్తే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు అనేక వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు.

ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని భాగంగా చేసుకోవాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, అంగన్వాడీ సిబ్బంది, పట్టణ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News