‘అరైవ్ అలైవ్–2026’లో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన
‘అరైవ్ అలైవ్–2026’లో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘ARRIVE ALIVE CAMPAIGN–2026’లో భాగంగా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని రామన్నపేట సీఐ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ…
రోడ్డు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని, వాహనం నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని, అలాగే మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని ప్రజలకు స్పష్టం చేశారు.రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది వికలాంగులుగా మారుతున్నారని, మరెందరో తమ అమూల్యమైన ప్రాణాలను కోల్పోతున్నారని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మాధవాచారితో పాటు ఆసుపత్రి సిబ్బంది, స్థానిక వార్డు మెంబర్, డాన్బోస్కో పాఠశాల హెడ్మాస్టర్ జానీ, అలాగే పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎం. సురేందర్ (ఏఎస్ఐ), కమలాకర్, మల్లికార్జున్, సత్యనారాయణ, స్వామి, నరసింహ, ప్రవీణ్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి