Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:44 AM

అర్ధశతాబ్దం తర్వాత ఒకే వేదికపై పూర్వ విద్యార్థులు.

అర్ధశతాబ్దం తర్వాత ఒకే వేదికపై పూర్వ విద్యార్థులు.

అర్ధశతాబ్దం తర్వాత ఒకే వేదికపై పూర్వ విద్యార్థులు.
January 25, 2026 06:45 PM 704 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

గురువులు నేర్పిన విద్య, విలువలను జీవితంలో అమలు చేసినప్పుడే సమాజానికి నిజమైన మేలు జరుగుతుందని రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ అన్నారు. చదువుకున్న పూర్వ విద్యార్థులు వ్యక్తిగత ఎదుగుదలకే పరిమితం కాకుండా సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 1974 నుంచి 1976 మధ్య కాలంలో ఆరవ, ఏడవ తరగతులు చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక జీఆర్‌ఎం ఫంక్షన్‌ హాల్‌లో స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.యాభై ఏళ్ల క్రితం ఒకే గదిలో చదువుకున్న సుమారు అరవై మంది విద్యార్థులు మళ్లీ ఒకే వేదికపై కలవడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆనాటి ఉపాధ్యాయులు రామిని కైలాసం, గోదాసు అంజయ్యలను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అదే విధంగా రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణ, కొమ్మాయిగూడెం సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డిలకు సత్కారం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు తమ బాల్యాన్ని తలుచుకుంటూ పాఠశాలలో నేర్చుకున్న పాఠాలు, ఆటలు, క్రమశిక్షణతో కూడిన బోధనను గుర్తు చేసుకున్నారు. ఆ విద్యే తమ జీవితాలకు పునాదిగా మారిందని పేర్కొన్నారు.అప్పటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. అర్ధశతాబ్దం తర్వాత తమ విద్యార్థుల నుంచి లభించిన ఈ గౌరవం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని అన్నారు. ఎనభై ఏళ్లు దాటినా విద్యార్థులు చూపిన ఆప్యాయత తమ మనసులను తాకిందని తెలిపారు.కొమ్మాయిగూడెం సర్పంచ్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. గురువులు నేర్పిన విద్య వల్లే తాను ప్రజాసేవ వైపు అడుగులు వేసి సర్పంచ్‌గా ఎన్నికయ్యానని చెప్పారు.పూర్వ విద్యార్థి గోదాసు గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశ్రాంత వాణిజ్య పన్నుల అధికారి గోదాసు మల్లేశం, మోటారు వాహనాల పరిశీలకుడు గోదాసు రవి, విశ్రాంత ఈఈ సురేందర్‌తో పాటు అయూబ్, బట్టే లక్ష్మణ్, ఏ.భద్రయ్య, జయసింహా రెడ్డి, డీఈ బండ వెంకటేశ్వర్ రెడ్డి, బుట్టే విశ్వనాథం, రామన్, కొమ్ము బిక్షపతి, వై.డి. మజర్, కాలేరు ఫన్నయ్య, ఏ.రమేష్, లోపాము చంద్రశేఖర్, మురళీధర్, భగవంతుం, రాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News