Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:18 AM

అర్ధరాత్రి ‘కామన్ మహిళ’గా కమిషనర్… ఆకతాయిలకు గట్టి షాక్!

అర్ధరాత్రి ‘కామన్ మహిళ’గా కమిషనర్… ఆకతాయిలకు గట్టి షాక్!

అర్ధరాత్రి ‘కామన్ మహిళ’గా కమిషనర్… ఆకతాయిలకు గట్టి షాక్!
06-05-2026 146 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

40 మంది ఆకతాయిల బండారం బట్టబయలు!

దిల్‌సుఖ్‌నగర్లో ఆకతాయిల అరాచకం వెలుగులోకి!

దిల్‌సుఖ్‌నగర్/చైతన్యపురి, : ఆకతాయిల వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి వినూత్నంగా ఆపరేషన్ చేపట్టారు. అర్ధరాత్రి యూనిఫాం లేకుండా సాధారణ మహిళలా మారి దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ పరిసరాల్లో పర్యవేక్షణ నిర్వహించారు.

రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఒంటరిగా రోడ్డుపై నిలబడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సమయంలో పలువురు యువకులు ఆమెను చేరుకుని అసభ్య వ్యాఖ్యలు, అనుచిత ప్రవర్తనతో ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. మద్యం, గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు కూడా వేధింపులకు పాల్పడినట్లు గుర్తించారు.

దాదాపు 40 మంది ఆకతాయిలు ఆమె చుట్టూ చేరినప్పటికీ, కమిషనర్ ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొంటూ వారిని గమనించారు. ఈ వ్యవధిలో పెట్రోలింగ్ సిబ్బంది స్పందన ఆలస్యంగా రావడం గమనార్హం. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆకతాయిలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు, ఈ ప్రాంతంలో హాస్టళ్లు అధికంగా ఉండటం వల్ల యువకుల అల్లర్లు పెరుగుతున్నట్లు గుర్తించారు

Sthanikam

అర్ధరాత్రి ‘కామన్ మహిళ’గా కమిషనర్… ఆకతాయిలకు గట్టి షాక్!

Article Image

40 మంది ఆకతాయిల బండారం బట్టబయలు!

దిల్‌సుఖ్‌నగర్లో ఆకతాయిల అరాచకం వెలుగులోకి!

దిల్‌సుఖ్‌నగర్/చైతన్యపురి, : ఆకతాయిల వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి వినూత్నంగా ఆపరేషన్ చేపట్టారు. అర్ధరాత్రి యూనిఫాం లేకుండా సాధారణ మహిళలా మారి దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ పరిసరాల్లో పర్యవేక్షణ నిర్వహించారు.

రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఒంటరిగా రోడ్డుపై నిలబడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సమయంలో పలువురు యువకులు ఆమెను చేరుకుని అసభ్య వ్యాఖ్యలు, అనుచిత ప్రవర్తనతో ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. మద్యం, గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు కూడా వేధింపులకు పాల్పడినట్లు గుర్తించారు.

దాదాపు 40 మంది ఆకతాయిలు ఆమె చుట్టూ చేరినప్పటికీ, కమిషనర్ ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొంటూ వారిని గమనించారు. ఈ వ్యవధిలో పెట్రోలింగ్ సిబ్బంది స్పందన ఆలస్యంగా రావడం గమనార్హం. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆకతాయిలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు, ఈ ప్రాంతంలో హాస్టళ్లు అధికంగా ఉండటం వల్ల యువకుల అల్లర్లు పెరుగుతున్నట్లు గుర్తించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News