40 మంది ఆకతాయిల బండారం బట్టబయలు!
దిల్సుఖ్నగర్లో ఆకతాయిల అరాచకం వెలుగులోకి!
దిల్సుఖ్నగర్/చైతన్యపురి, : ఆకతాయిల వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి వినూత్నంగా ఆపరేషన్ చేపట్టారు. అర్ధరాత్రి యూనిఫాం లేకుండా సాధారణ మహిళలా మారి దిల్సుఖ్నగర్ బస్టాండ్ పరిసరాల్లో పర్యవేక్షణ నిర్వహించారు.
రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఒంటరిగా రోడ్డుపై నిలబడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సమయంలో పలువురు యువకులు ఆమెను చేరుకుని అసభ్య వ్యాఖ్యలు, అనుచిత ప్రవర్తనతో ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. మద్యం, గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు కూడా వేధింపులకు పాల్పడినట్లు గుర్తించారు.
దాదాపు 40 మంది ఆకతాయిలు ఆమె చుట్టూ చేరినప్పటికీ, కమిషనర్ ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొంటూ వారిని గమనించారు. ఈ వ్యవధిలో పెట్రోలింగ్ సిబ్బంది స్పందన ఆలస్యంగా రావడం గమనార్హం. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆకతాయిలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు, ఈ ప్రాంతంలో హాస్టళ్లు అధికంగా ఉండటం వల్ల యువకుల అల్లర్లు పెరుగుతున్నట్లు గుర్తించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి