అనారోగ్య బాధిత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య పరామర్శ
అనారోగ్య బాధిత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య పరామర్శ
Editor Desk
నార్కట్ పల్లి స్థానికం ప్రధాన ప్రతినిధి
నార్కెట్పల్లి పట్టణంలో పలు కుటుంబాలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం పరామర్శించారు. అనారోగ్యంతో ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నవారిని కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పారు.పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొబ్బలి మల్లేష్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లిన చిరుమర్తి లింగయ్య, చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.అదేవిధంగా నార్కెట్పల్లి పట్టణ కేంద్రానికి చెందిన దుబ్బాక అంజయ్య అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటుండగా, వారి యోగక్షేమాలను విచారించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఇటీవల మరణించిన పసునూరి భారతమ్మ కుటుంబాన్ని కూడా చిరుమర్తి లింగయ్య పరామర్శించారు. భారతమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆమె భర్త పసునూరి రవీందర్తో పాటు కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి