PRINT TIME: April 10, 2026 09:12 AM
అమావాస్యనాడు మల్లన్న గుట్టలో స్వయంబూ మల్లికార్జున స్వామికి విశేష పూజలు
అమావాస్యనాడు మల్లన్న గుట్టలో స్వయంబూ మల్లికార్జున స్వామికి విశేష పూజలు
January 10, 2026 09:18 AM
87 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
అమావాస్య సందర్భంగా ఈ నెల 18న (ఆదివారం) యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదాన పల్లి గ్రామంలో వెలసినమల్లన్న గుట్టపై ఉన్న శ్రీ స్వయంబూ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రదోష వేళ సాయంత్రం స్వామికి ప్రత్యేక అభిషేకం, మాస కళ్యాణం, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి.ఈ సందర్భంగా స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముందని, ఆలయ పరిసరాల్లో పూజా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. మాస కళ్యాణం, అన్న ప్రసాద కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని భక్తులను ఆలయ కమిటీ కోరింది.
కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనుకునే భక్తులు 9666335402 నంబర్ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి