PRINT TIME: May 27, 2026 12:55 AM
అమావాస్య పర్వదినాన స్వయంభు మల్లన్న గుట్టపై ప్రత్యేక పూజలు
అమావాస్య పర్వదినాన స్వయంభు మల్లన్న గుట్టపై ప్రత్యేక పూజలు
January 18, 2026 06:38 AM
156 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో స్వయంభు శ్రీ మల్లన్న గుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా
అర్చకులు బేతోజి శశిధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అభిషేకానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి దర్శనం చేసుకున్నారని
అర్చకులు తెలిపారు.
అమావాస్య సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా భక్తి వాతావరణంతో నిండిపోయి, మంత్రోచ్చారణలతో మార్మోగింది. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి