అమ్మా–నాన్నను కోల్పోయిన చిన్నారులకు ప్రభుత్వమే అండగా నిలవాలి
అమ్మా–నాన్నను కోల్పోయిన చిన్నారులకు ప్రభుత్వమే అండగా నిలవాలి
స్థానికం బృందం
బాలల హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్
స్థానికం ప్రధాన ప్రతినిధి
తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన చిన్నారుల బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్ కోరారు. మూడు సంవత్సరాల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయిన యాదగిరిగుట్ట మండలం చిన్న గౌరాయిపల్లి గ్రామానికి చెందిన గుజ్జ సంకీర్తన, గుజ్జ వర్షిణిల భవిష్యత్తు అంధకారంలో పడకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం ఆయన చిన్నారులను కలిసి వారి పరిస్థితిని తెలుసుకొని, వేదిక తరఫున అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. చిన్న వయసులోనే అమ్మా–నాన్నలను కోల్పోయిన ఈ పిల్లలకు బాధ్యత తీసుకునే సమీప బంధువులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులే చందాలు వేసి తల్లి గుజ్జ రాధ (40) అంత్యక్రియలు నిర్వహించారని తెలిపారు.
గుజ్జ రాజు పుట్టుకతోనే అంధుడని, సుమారు పదహారు సంవత్సరాల క్రితం రాధను వివాహం చేసుకున్నాడని చెప్పారు. వారికి సంకీర్తన (12), వర్షిణి (10) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని వివరించారు. రాజు తల్లి గుజ్జ వజ్రమ్మ పద్నాలుగు సంవత్సరాల క్రితమే మృతి చెందగా, రాజు తరపు బంధువులు ఎవరూ లేని పరిస్థితి ఉందన్నారు.ప్రస్తుతం రాధ తల్లి విశాలాక్షి చిన్నారుల బాగోగులు చూసుకుంటున్నా, ఆమె వయోవృద్ధురాలు కావడంతో దీర్ఘకాలంగా పిల్లలను పోషించడం సాధ్యం కాదని వెంకటేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మానవతా దృక్పథంతో స్పందించి చిన్నారుల పూర్తి బాధ్యతను ప్రభుత్వం తీసుకొని, వారు మైనారిటీ వయసు చేరే వరకు చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి