Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:46 AM

అమ్మా–నాన్నను కోల్పోయిన చిన్నారులకు ప్రభుత్వమే అండగా నిలవాలి

అమ్మా–నాన్నను కోల్పోయిన చిన్నారులకు ప్రభుత్వమే అండగా నిలవాలి

అమ్మా–నాన్నను కోల్పోయిన చిన్నారులకు ప్రభుత్వమే అండగా నిలవాలి
January 23, 2026 08:27 PM 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బాలల హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్

స్థానికం ప్రధాన ప్రతినిధి

తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన చిన్నారుల బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్ కోరారు. మూడు సంవత్సరాల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయిన యాదగిరిగుట్ట మండలం చిన్న గౌరాయిపల్లి గ్రామానికి చెందిన గుజ్జ సంకీర్తన, గుజ్జ వర్షిణిల భవిష్యత్తు అంధకారంలో పడకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం ఆయన చిన్నారులను కలిసి వారి పరిస్థితిని తెలుసుకొని, వేదిక తరఫున అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. చిన్న వయసులోనే అమ్మా–నాన్నలను కోల్పోయిన ఈ పిల్లలకు బాధ్యత తీసుకునే సమీప బంధువులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులే చందాలు వేసి తల్లి గుజ్జ రాధ (40) అంత్యక్రియలు నిర్వహించారని తెలిపారు.

గుజ్జ రాజు పుట్టుకతోనే అంధుడని, సుమారు పదహారు సంవత్సరాల క్రితం రాధను వివాహం చేసుకున్నాడని చెప్పారు. వారికి సంకీర్తన (12), వర్షిణి (10) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని వివరించారు. రాజు తల్లి గుజ్జ వజ్రమ్మ పద్నాలుగు సంవత్సరాల క్రితమే మృతి చెందగా, రాజు తరపు బంధువులు ఎవరూ లేని పరిస్థితి ఉందన్నారు.ప్రస్తుతం రాధ తల్లి విశాలాక్షి చిన్నారుల బాగోగులు చూసుకుంటున్నా, ఆమె వయోవృద్ధురాలు కావడంతో దీర్ఘకాలంగా పిల్లలను పోషించడం సాధ్యం కాదని వెంకటేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మానవతా దృక్పథంతో స్పందించి చిన్నారుల పూర్తి బాధ్యతను ప్రభుత్వం తీసుకొని, వారు మైనారిటీ వయసు చేరే వరకు చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News