Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:54 AM

అక్రమాల ఆరోపణలపై వీఓఏ తొలగింపుకు డిమాండ్ మహిళా సంఘాల ఫిర్యాదు.. డీఆర్‌డీఏ పీడీకి వినతిపత్రం

అక్రమాల ఆరోపణలపై వీఓఏ తొలగింపుకు డిమాండ్ మహిళా సంఘాల ఫిర్యాదు.. డీఆర్‌డీఏ పీడీకి వినతిపత్రం

అక్రమాల ఆరోపణలపై వీఓఏ తొలగింపుకు డిమాండ్ మహిళా సంఘాల ఫిర్యాదు.. డీఆర్‌డీఏ పీడీకి వినతిపత్రం
24-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చింతపల్లి,

పి.కె. మల్లెపల్లి గ్రామంలో వీఓఏగా పనిచేసిన గనిపల్లి మాధవిపై వచ్చిన అక్రమాల ఆరోపణలపై చర్యలు తీసుకుని విధుల నుంచి తొలగించాలని మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మహిళా సంఘ బంధం అధ్యక్షురాలు బాడిగ అలివేలు, ఉపాధ్యక్షురాలు పోలె జంగమ్మ ఆధ్వర్యంలో డీఆర్‌డీఏ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

మహిళా సంఘాల నాయకులు మాట్లాడుతూ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఈ నెల 18న నిర్వహించిన గ్రామసభలో వీఓఏ గనిపల్లి మాధవిపై వచ్చిన ఆరోపణలు నిరూపితమయ్యాయని తెలిపారు. మహిళా సంఘ సభ్యులు, లీడర్ల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బులను వెంటనే రికవరీ చేసి, ఆమెను విధుల నుంచి తొలగించాలని గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ఆమె స్థానంలో కొత్త వీఓఏను నియమించాలని డిమాండ్ చేశారు.

గ్రామస్తుడు కోట్ల మహేందర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామసభ తీర్మానం జరిగినప్పటికీ కొంతమంది అధికారులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై స్పందించిన డీఆర్‌డీఏ పీడీ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ కమిటీల తీర్మానం ఆధారంగా విచారణ చేపట్టి, అక్రమాలు రుజువైతే వీఓఏను విధుల నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి అక్రమ వసూళ్లను రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కొప్పోలు అమర్నాథ్ గౌడ్, దార్ల రాజు శ్యాంసుందర్, పూల నరేష్, వెంకటయ్య, గనిపల్లి వెంకటేష్, దార్ల శేఖర్, ముచ్చర్ల నరేష్, దార్ల ప్రభాకర్, జేల్లా అరవింద్, పబ్బు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అక్రమాల ఆరోపణలపై వీఓఏ తొలగింపుకు డిమాండ్ మహిళా సంఘాల ఫిర్యాదు.. డీఆర్‌డీఏ పీడీకి వినతిపత్రం

Article Image

చింతపల్లి,

పి.కె. మల్లెపల్లి గ్రామంలో వీఓఏగా పనిచేసిన గనిపల్లి మాధవిపై వచ్చిన అక్రమాల ఆరోపణలపై చర్యలు తీసుకుని విధుల నుంచి తొలగించాలని మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మహిళా సంఘ బంధం అధ్యక్షురాలు బాడిగ అలివేలు, ఉపాధ్యక్షురాలు పోలె జంగమ్మ ఆధ్వర్యంలో డీఆర్‌డీఏ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

మహిళా సంఘాల నాయకులు మాట్లాడుతూ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఈ నెల 18న నిర్వహించిన గ్రామసభలో వీఓఏ గనిపల్లి మాధవిపై వచ్చిన ఆరోపణలు నిరూపితమయ్యాయని తెలిపారు. మహిళా సంఘ సభ్యులు, లీడర్ల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బులను వెంటనే రికవరీ చేసి, ఆమెను విధుల నుంచి తొలగించాలని గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ఆమె స్థానంలో కొత్త వీఓఏను నియమించాలని డిమాండ్ చేశారు.

గ్రామస్తుడు కోట్ల మహేందర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామసభ తీర్మానం జరిగినప్పటికీ కొంతమంది అధికారులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై స్పందించిన డీఆర్‌డీఏ పీడీ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ కమిటీల తీర్మానం ఆధారంగా విచారణ చేపట్టి, అక్రమాలు రుజువైతే వీఓఏను విధుల నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి అక్రమ వసూళ్లను రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కొప్పోలు అమర్నాథ్ గౌడ్, దార్ల రాజు శ్యాంసుందర్, పూల నరేష్, వెంకటయ్య, గనిపల్లి వెంకటేష్, దార్ల శేఖర్, ముచ్చర్ల నరేష్, దార్ల ప్రభాకర్, జేల్లా అరవింద్, పబ్బు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News