Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 AM

ఐరా గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ఐరా గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ఐరా గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
07-03-2026 201 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణంలోని ఐరా గ్లోబల్ స్కూల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల చైర్మన్ అరుణ, కరస్పాండెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మహిళల సాధికారతతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మహిళల గౌరవం, సమాన హక్కులు, మహిళా సాధికారత వంటి అంశాలపై ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాలలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్ రెడ్డి, అధ్యాపకులు , విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఐరా గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Article Image

చౌటుప్పల్ పట్టణంలోని ఐరా గ్లోబల్ స్కూల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల చైర్మన్ అరుణ, కరస్పాండెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మహిళల సాధికారతతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మహిళల గౌరవం, సమాన హక్కులు, మహిళా సాధికారత వంటి అంశాలపై ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాలలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్ రెడ్డి, అధ్యాపకులు , విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News