ఐఎన్టీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బంటు చుక్కయ్య గౌడ్ నియామకం
ఐఎన్టీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బంటు చుక్కయ్య గౌడ్ నియామకం
Biksham
సూర్యాపేట: ఆమనగల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంటు చుక్కయ్య గౌడ్కు కీలక పదవి లభించింది. తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆయనను మంగళవారం నియమించారు.
కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం ఆనందదాయకమని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా బంటు చుక్కయ్య గౌడ్ మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, నాగన్నలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి