Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:50 AM

ఐద్వా జాతీయ మహాసభలు జయప్రదం చేయాలి. 25న హైదరాబాద్ బహిరంగ సభకు మహిళలు భారీగా తరలిరావాలి

ఐద్వా జాతీయ మహాసభలు జయప్రదం చేయాలి. 25న హైదరాబాద్ బహిరంగ సభకు మహిళలు భారీగా తరలిరావాలి

ఐద్వా జాతీయ మహాసభలు జయప్రదం చేయాలి. 25న హైదరాబాద్ బహిరంగ సభకు మహిళలు భారీగా తరలిరావాలి
January 22, 2026 06:04 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు జంపాల అండాలు పిలుపు

స్థానికం ప్రధాన ప్రతినిధి

హైదరాబాద్‌లో ఈ నెల 25న నిర్వహించనున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ మహాసభల సందర్భంగా జరగనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు జంపాల అండాలు పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన మహిళలు కదిలి వచ్చి ఈ చారిత్రాత్మక సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు.మునిపంపుల గ్రామంలో ఐద్వా గ్రామ శాఖ ఆధ్వర్యంలో మహాసభల ప్రచార కార్యక్రమంలో భాగంగా రంగురంగుల బెలూన్లు ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా జంపాల అండాలు మాట్లాడుతూ, దేశంలోనే బలమైన మహిళా హక్కుల ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఐద్వా 5వ జాతీయ మహాసభలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదిక కావడం గర్వకారణమన్నారు.జాతీయ మహాసభల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై విస్తృత చర్చ జరగడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. మహిళలపై నిత్యం జరుగుతున్న అత్యాచారాలు, అసమానతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, స్త్రీని వ్యాపార వస్తువుగా మార్చి పెట్టుబడి వర్గాలు లాభాలు గడిస్తున్నాయని విమర్శించారు.“అవనిలో సగం–అన్నింటిలో సగం” అనే నినాదాలు ప్రచారాలకు మాత్రమే పరిమితమైపోయాయని, మహిళల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలు అవసరమైన చొరవ చూపడం లేదన్నారు. మహిళా హక్కుల రక్షణ కోసం ఐద్వా చేపడుతున్న పోరాటాల్లో మహిళలు భాగస్వాములు కావాలని, ఈ నెల 25న హైదరాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా శాఖ కార్యదర్శి జోగుల ధనలక్ష్మి, ఐద్వా గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు యాదాసు శారద, తాళ్లపల్లి హేమలత, గ్రామ నాయకులు నోముల మంగమ్మ, మౌనిక, బొడ్డుపల్లి సంధ్య, ఆకుల ముత్తమ్మ, జంపాల పద్మమ్మ, పులిపలుపుల జయమ్మ, కూనూరు అంజమ్మ, బోనగిరి మౌనిక, గంప పద్మ, గంప యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News