Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మలిదశ ఉద్యమకారుడి ఆకస్మిక మరణం “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 09:30 PM

అధిక శబ్దంతో ప్రయాణిస్తే ఉపేక్షించేది లేదు!

అధిక శబ్దంతో ప్రయాణిస్తే ఉపేక్షించేది లేదు!

అధిక శబ్దంతో ప్రయాణిస్తే ఉపేక్షించేది లేదు!
April 08, 2026 07:09 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్లగొండలో రోడ్ రోలర్‌తో 72 సైలెన్సర్ల ధ్వంసం..

నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు..

లైసెన్సులు రద్దు చేస్తామని అదనపు ఎస్పీ రమేష్ హెచ్చరిక..

నల్లగొండ : రహదారులపై వెళ్తూ చెవులు చిల్లులు పడేలా శబ్దకాలుష్యం సృష్టిస్తున్న వాహనదారులపై నల్లగొండ జిల్లా పోలీసులు కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన 72 మాడిఫైడ్ సైలెన్సర్లను బుధవారం పట్టణంలోని క్లాక్ టవర్ కూడలి వద్ద రోడ్ రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు.​

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను కాదని అధిక శబ్దం వచ్చేలా మార్పులు చేసిన వాహనాలను గుర్తించి వాటి నుంచి సైలెన్సర్లను తొలగించారు. అదనపు ఎస్పీ రమేష్ పర్యవేక్షణలో వీటిని బహిరంగంగా ధ్వంసం చేయడం ద్వారా వాహనదారుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. యువత మోజుతో సైలెన్సర్లను మార్చి సామాన్య ప్రజలను, ముఖ్యంగా వృద్ధులు, రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.ఇకపై మాడిఫైడ్ సైలెన్సర్లతో దొరికితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, పదేపదే నిబంధనలు అతిక్రమిస్తే డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.

ఎవరైనా అధిక శబ్దంతో వాహనాలు నడుపుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవ రావు, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్.ఐలు సైదులు, సైదా బాబు, రాజీవ్ రెడ్డి తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News