Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:58 AM

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఓటరు అవగాహన ప్రతిజ్ఞ

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఓటరు అవగాహన ప్రతిజ్ఞ

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఓటరు అవగాహన ప్రతిజ్ఞ
23-01-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి

జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో శుక్రవారం ‘ఓటరు అవగాహన ప్రతిజ్ఞ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి 25న జరగనున్న జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించిన నేపథ్యంలో యూనివర్సిటీలో ప్రతిజ్ఞ చేపట్టారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణా రెడ్డి ఉద్యోగులు, విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.

బాధ్యతాయుతమైన ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, కుల, మత, ప్రాంత, లింగ, భాషా భేదాలు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి, డైరెక్టర్లు ప్రొ. డి. రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. పి. వెంకట రమణ, ప్రొ. బి. శ్రీనివాస్, ప్రొ. చంద్రకళ, ఎన్.సి. వేణుగోపాల్, రుషేంద్ర మణి, కాంతం ప్రేమ్ కుమార్, విశ్వనాథ్, డా. యాకేష్ దైదతో పాటు వివిధ విభాగాల డైరెక్టర్లు, డీన్లు, బోధన–బోధనేతర సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఓటరు అవగాహన ప్రతిజ్ఞ

Article Image
హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి

జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో శుక్రవారం ‘ఓటరు అవగాహన ప్రతిజ్ఞ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి 25న జరగనున్న జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించిన నేపథ్యంలో యూనివర్సిటీలో ప్రతిజ్ఞ చేపట్టారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణా రెడ్డి ఉద్యోగులు, విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.

బాధ్యతాయుతమైన ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, కుల, మత, ప్రాంత, లింగ, భాషా భేదాలు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి, డైరెక్టర్లు ప్రొ. డి. రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. పి. వెంకట రమణ, ప్రొ. బి. శ్రీనివాస్, ప్రొ. చంద్రకళ, ఎన్.సి. వేణుగోపాల్, రుషేంద్ర మణి, కాంతం ప్రేమ్ కుమార్, విశ్వనాథ్, డా. యాకేష్ దైదతో పాటు వివిధ విభాగాల డైరెక్టర్లు, డీన్లు, బోధన–బోధనేతర సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News