Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:21 PM

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఓటరు అవగాహన ప్రతిజ్ఞ

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఓటరు అవగాహన ప్రతిజ్ఞ

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఓటరు అవగాహన ప్రతిజ్ఞ
January 23, 2026 03:42 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి

జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో శుక్రవారం ‘ఓటరు అవగాహన ప్రతిజ్ఞ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి 25న జరగనున్న జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించిన నేపథ్యంలో యూనివర్సిటీలో ప్రతిజ్ఞ చేపట్టారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణా రెడ్డి ఉద్యోగులు, విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.

బాధ్యతాయుతమైన ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, కుల, మత, ప్రాంత, లింగ, భాషా భేదాలు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి, డైరెక్టర్లు ప్రొ. డి. రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. పి. వెంకట రమణ, ప్రొ. బి. శ్రీనివాస్, ప్రొ. చంద్రకళ, ఎన్.సి. వేణుగోపాల్, రుషేంద్ర మణి, కాంతం ప్రేమ్ కుమార్, విశ్వనాథ్, డా. యాకేష్ దైదతో పాటు వివిధ విభాగాల డైరెక్టర్లు, డీన్లు, బోధన–బోధనేతర సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News