Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:38 AM

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఓటరు అవగాహన ప్రతిజ్ఞ

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఓటరు అవగాహన ప్రతిజ్ఞ

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఓటరు అవగాహన ప్రతిజ్ఞ
January 23, 2026 03:42 PM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి

జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో శుక్రవారం ‘ఓటరు అవగాహన ప్రతిజ్ఞ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి 25న జరగనున్న జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించిన నేపథ్యంలో యూనివర్సిటీలో ప్రతిజ్ఞ చేపట్టారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణా రెడ్డి ఉద్యోగులు, విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.

బాధ్యతాయుతమైన ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, కుల, మత, ప్రాంత, లింగ, భాషా భేదాలు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి, డైరెక్టర్లు ప్రొ. డి. రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. పి. వెంకట రమణ, ప్రొ. బి. శ్రీనివాస్, ప్రొ. చంద్రకళ, ఎన్.సి. వేణుగోపాల్, రుషేంద్ర మణి, కాంతం ప్రేమ్ కుమార్, విశ్వనాథ్, డా. యాకేష్ దైదతో పాటు వివిధ విభాగాల డైరెక్టర్లు, డీన్లు, బోధన–బోధనేతర సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News