Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 09:36 AM

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఓటరు అవగాహన ప్రతిజ్ఞ

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఓటరు అవగాహన ప్రతిజ్ఞ

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఓటరు అవగాహన ప్రతిజ్ఞ
January 23, 2026 03:42 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి

జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో శుక్రవారం ‘ఓటరు అవగాహన ప్రతిజ్ఞ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి 25న జరగనున్న జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించిన నేపథ్యంలో యూనివర్సిటీలో ప్రతిజ్ఞ చేపట్టారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణా రెడ్డి ఉద్యోగులు, విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.

బాధ్యతాయుతమైన ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, కుల, మత, ప్రాంత, లింగ, భాషా భేదాలు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి, డైరెక్టర్లు ప్రొ. డి. రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. పి. వెంకట రమణ, ప్రొ. బి. శ్రీనివాస్, ప్రొ. చంద్రకళ, ఎన్.సి. వేణుగోపాల్, రుషేంద్ర మణి, కాంతం ప్రేమ్ కుమార్, విశ్వనాథ్, డా. యాకేష్ దైదతో పాటు వివిధ విభాగాల డైరెక్టర్లు, డీన్లు, బోధన–బోధనేతర సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News