ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ........
తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం కోదాడలో ఘనంగా జరిగాయి. కోదాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ అజీమ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అజీమ్ మాట్లాడుతూ శివ చరణ్ రెడ్డి నాయకత్వంలో యూత్ కాంగ్రెస్ బలోపేతం అవుతుందని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు మునగాల మండల అధ్యక్షులు తక్కెళ్ళపాటి సాయి, షరీఫ్ బాబా, జానీ మాలిక్ బాయ్ తదితర యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు......

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి