Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:13 AM

ఆలస్యం జరిగితే చర్యలు తప్పవు – అదనపు కలెక్టర్

ఆలస్యం జరిగితే చర్యలు తప్పవు – అదనపు కలెక్టర్

ఆలస్యం జరిగితే చర్యలు తప్పవు – అదనపు కలెక్టర్
January 28, 2026 06:03 PM 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిర్దేశిత గడువులోనే ఏడవ చిన్ననీటి పథకాల గణన పూర్తి చేయాలి

యాదాద్రి స్థానికం ప్రధాన ప్రతినిధి

జిల్లాలో అమలవుతున్న ఏడవ చిన్ననీటి తరహా పథకాల గణనను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏడవ చిన్ననీటి తరహా పథకాల గణనపై ఏఈవోలు, సంబంధిత అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణన ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గణన పనులు ఏఈవోలు, జీపీవోలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సిబ్బంది సమన్వయంతో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు గణన పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ప్రణాళిక అధికారి వెంకటరమణ, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటమణారెడ్డి పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News