Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 03:01 AM

ఆలస్యం జరిగితే చర్యలు తప్పవు – అదనపు కలెక్టర్

ఆలస్యం జరిగితే చర్యలు తప్పవు – అదనపు కలెక్టర్

ఆలస్యం జరిగితే చర్యలు తప్పవు – అదనపు కలెక్టర్
January 28, 2026 06:03 PM 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

నిర్దేశిత గడువులోనే ఏడవ చిన్ననీటి పథకాల గణన పూర్తి చేయాలి

యాదాద్రి స్థానికం ప్రధాన ప్రతినిధి

జిల్లాలో అమలవుతున్న ఏడవ చిన్ననీటి తరహా పథకాల గణనను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏడవ చిన్ననీటి తరహా పథకాల గణనపై ఏఈవోలు, సంబంధిత అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణన ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గణన పనులు ఏఈవోలు, జీపీవోలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సిబ్బంది సమన్వయంతో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు గణన పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ప్రణాళిక అధికారి వెంకటరమణ, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటమణారెడ్డి పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News