Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:38 PM

ఆలస్యం జరిగితే చర్యలు తప్పవు – అదనపు కలెక్టర్

ఆలస్యం జరిగితే చర్యలు తప్పవు – అదనపు కలెక్టర్

ఆలస్యం జరిగితే చర్యలు తప్పవు – అదనపు కలెక్టర్
28-01-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిర్దేశిత గడువులోనే ఏడవ చిన్ననీటి పథకాల గణన పూర్తి చేయాలి

యాదాద్రి స్థానికం ప్రధాన ప్రతినిధి

జిల్లాలో అమలవుతున్న ఏడవ చిన్ననీటి తరహా పథకాల గణనను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏడవ చిన్ననీటి తరహా పథకాల గణనపై ఏఈవోలు, సంబంధిత అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణన ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గణన పనులు ఏఈవోలు, జీపీవోలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సిబ్బంది సమన్వయంతో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు గణన పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ప్రణాళిక అధికారి వెంకటరమణ, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటమణారెడ్డి పాల్గొన్నారు.

Sthanikam

ఆలస్యం జరిగితే చర్యలు తప్పవు – అదనపు కలెక్టర్

Article Image

నిర్దేశిత గడువులోనే ఏడవ చిన్ననీటి పథకాల గణన పూర్తి చేయాలి

యాదాద్రి స్థానికం ప్రధాన ప్రతినిధి

జిల్లాలో అమలవుతున్న ఏడవ చిన్ననీటి తరహా పథకాల గణనను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏడవ చిన్ననీటి తరహా పథకాల గణనపై ఏఈవోలు, సంబంధిత అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణన ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గణన పనులు ఏఈవోలు, జీపీవోలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సిబ్బంది సమన్వయంతో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు గణన పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ప్రణాళిక అధికారి వెంకటరమణ, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటమణారెడ్డి పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News