విద్యార్థులను అభినందించిన ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి
స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్ జి.శ్రీనివాస్
ఆలేరు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో జెడ్పీహెచ్ఎస్ విద్యార్థుల ప్రతిభ డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి స్మారకంగా నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ విభాగంలో మొదటి బహుమతిని సాధించారు.విజేతలైన విద్యార్థులకు భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు బహుమతులు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు బండ్రు శోభారాణి,బొల్లగని సత్యనారాయణ,ప్రభుత్వాధికారులు,ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ బృందం,పాఠశాల సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి