Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 03:04 AM

ఆదోనిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ – 18 మందికి రూ.7.62 లక్షల సాయం

ఆదోనిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ – 18 మందికి రూ.7.62 లక్షల సాయం

ఆదోనిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ – 18 మందికి రూ.7.62 లక్షల సాయం
January 28, 2026 08:07 PM 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆదోని పట్టణంలోని ఉమాపతి నాయుడు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆదోని నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ఇన్‌చార్జి మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, ఆదోని నియోజకవర్గానికి చెందిన మొత్తం పద్దెనిమిది మంది లబ్ధిదారులకు రూ.7 లక్షల 62 వేల 897 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసిందని తెలిపారు.

ఆరోగ్య చికిత్సలు, అత్యవసర వైద్య అవసరాలు, ప్రమాదాలు తదితర సందర్భాల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న దానికి ఈ సహాయమే నిదర్శనమని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News