Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెడ్ కానిస్టేబుల్ అంగోతు యాదగిరికి ఘన నివాళి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:44 PM

ఆదోనిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ – 18 మందికి రూ.7.62 లక్షల సాయం

ఆదోనిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ – 18 మందికి రూ.7.62 లక్షల సాయం

ఆదోనిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ – 18 మందికి రూ.7.62 లక్షల సాయం
January 28, 2026 08:07 PM 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆదోని పట్టణంలోని ఉమాపతి నాయుడు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆదోని నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ఇన్‌చార్జి మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, ఆదోని నియోజకవర్గానికి చెందిన మొత్తం పద్దెనిమిది మంది లబ్ధిదారులకు రూ.7 లక్షల 62 వేల 897 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసిందని తెలిపారు.

ఆరోగ్య చికిత్సలు, అత్యవసర వైద్య అవసరాలు, ప్రమాదాలు తదితర సందర్భాల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న దానికి ఈ సహాయమే నిదర్శనమని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News