ఆదోనిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
ఆదోనిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
యువగళం అధినేత, విద్యా ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఆదోనిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మదిరే సూరం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని ప్రశంసించారు.రాష్ట్ర ప్రజల తరఫున, ముఖ్యంగా ఆదోని నియోజకవర్గం ప్రజలు, గ్రామీణ ప్రజల తరఫున నారా లోకేష్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సౌదీ రూఫ్, మాజీ కౌన్సిలర్ రామచంద్ర, సోమశేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మల్లికార్జున, జి. రఘునాథ్ రెడ్డి, మద్దికేర రామకృష్ణ, శ్రీనివాసులు, కారుమంచి, మల్లేశ్వరప్ప, ఎన్బీకే నాగరాజ్, షాషావలి, ఎండి హుస్సేన్, బీటీ శీను, గోవిందరాజులు, రాముడు, మాజీ సర్పంచ్ గోవిందు, తిక్కన్న, రమేష్, సలకలకొండ శీను, బద్రి, మదిరే శ్రీనివాస్, రాజు, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి