Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:51 AM

ఆదోని జిల్లా సాధనకు ఉద్యమం ఉధృతం

ఆదోని జిల్లా సాధనకు ఉద్యమం ఉధృతం

ఆదోని జిల్లా సాధనకు ఉద్యమం ఉధృతం
January 16, 2026 06:21 AM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని జిల్లా సాధనకు ఉద్యమం ఉధృతం

24న సంపూర్ణ బంద్, 18న బైక్ ర్యాలీ : జేఏసీ

ఆదోని, స్థానిక ప్రతినిధి

ఆదోని జిల్లా సాధన కోసం జేఏసీ చేపడుతున్న ఉద్యమ కార్యచరణను జేఏసీ నాయకులు వెల్లడించారు. గురువారం ఆదోని భీమాస్ హోటల్‌లోని జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రఘురామయ్య మాట్లాడుతూ.. జిల్లాల పునర్విభజన కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఆధ్వర్యంలో మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కలిసి ఆదోని జిల్లా అంశంపై చర్చించామని తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మూడుసార్లు చర్చించినట్లు మంత్రి వెల్లడించారని చెప్పారు. సంక్రాంతి అనంతరం మంత్రులందరూ కలిసి ముఖ్యమంత్రితో చర్చించి స్పష్టత ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

కర్నూలులో మంత్రి టీజీ భరత్‌ను కలిసి వినతిపత్రం అందజేసి ఆదోని జిల్లా కోసం మద్దతు కోరగా, చివరకు ఈ అంశాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆదోని జిల్లా అంశాన్ని బర్నింగ్ ఇష్యూ అని పేర్కొంటూ సంపూర్ణ మద్దతు ప్రకటించారని అన్నారు.

ఆదోని జిల్లా ఉద్యమానికి సీపీఐ కర్నూలు జిల్లా కార్యవర్గం సంపూర్ణ మద్దతు తెలపడం ఉద్యమానికి బలాన్ని చేకూర్చిందని జేఏసీ నాయకులు తెలిపారు.జేఏసీ నాయకులు అశోకానంద రెడ్డి మాట్లాడుతూ.. ఆదోని జిల్లా ఏర్పాటు కోసం జనవరి 24న ఆదోని, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో సంపూర్ణ బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే జనవరి 18న ఆదోని పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వీరేష్, సుజ్ఞానమ్మ, కమతం వెంకటేష్, దస్తగిరి నాయుడు, కుంకునూరు వీరేష్, ప్రకాష్, అయ్యాళప్ప, కృష్ణమూర్తి గౌడ్, నరేంద్ర యాదవ్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News