Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:20 AM

ఆదోని జిల్లా సాధన కోసం బందును జయప్రదం చేయాలంటూ సిపిఐ మద్దతు – బైక్ ర్యాలీతో పోరాటం

ఆదోని జిల్లా సాధన కోసం బందును జయప్రదం చేయాలంటూ సిపిఐ మద్దతు – బైక్ ర్యాలీతో పోరాటం

ఆదోని జిల్లా సాధన కోసం బందును జయప్రదం చేయాలంటూ సిపిఐ మద్దతు – బైక్ ర్యాలీతో పోరాటం
January 23, 2026 05:14 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆదోని జిల్లా సాధన కోసం జేఏసీ పిలుపునిచ్చిన బందును జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ సమితి వెల్లడించింది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రతిపక్షంలో నిలిపి, బైక్ ర్యాలీ ద్వారా ప్రజా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తామని సిపిఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్ స్పష్టం చేశారు.

ఆదోనిలోని బీమాస్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆదోని ప్రజల చిరకాల డిమాండ్ అయిన జిల్లా సాధనను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు విమర్శించారు. అభివృద్ధి, పరిపాలన సౌకర్యం పేరుతో హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రాంత అభివృద్ధికి జిల్లా అవసరం అనివార్యమని, అయితే ప్రజల న్యాయమైన డిమాండ్‌ను పక్కన పెట్టి రాజకీయ లాభనష్టాలకే ప్రభుత్వం పరిమితం అయ్యిందని ఆయన తెలిపారు. ఇకపై ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని, జిల్లా ప్రకటన విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు.జేఏసీ పిలుపునిచ్చిన బందులో సిపిఐ నాయకులు, కార్యకర్తలు ముందుండి పాల్గొని, ప్రజలు స్వచ్ఛందంగా బందును జయప్రదం చేసి ఆదోని జిల్లా సాధన ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని టి. వీరేష్ పిలుపునిచ్చారు. ఈ బందు ప్రభుత్వానికి గట్టి హెచ్చరికగా నిలవాలని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు లక్ష్మీనారాయణ, రమేష్ కుమార్, AIYF, AISF కార్యదర్శులు అంజిత్ గౌడ్, దస్తగిరి, CPI న్యూ గాంధీనగర్ శాఖ కార్యదర్శులు విజయ్ కుమార్, లింగప్ప నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News