Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:05 PM

ఆధిపత్య రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి నార్కట్‌పల్లి ఎస్సైకి వినతి

ఆధిపత్య రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి నార్కట్‌పల్లి ఎస్సైకి వినతి

ఆధిపత్య రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి నార్కట్‌పల్లి ఎస్సైకి వినతి
January 21, 2026 06:28 PM 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నార్కట్‌పల్లి, స్థానికం ప్రధాన ప్రతినిధి

నార్కట్‌పల్లి పట్టణంలోని వెడ్డింగ్ హాల్‌లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు శాంతియుతంగా జరగేలా చర్యలు తీసుకోవాలని నార్కట్‌పల్లి నూతన ఎస్సైకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయనను సన్మానించారు.ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో గ్రామాల్లో కుల, రాజకీయ ఆధిపత్యాలు పెరుగుతున్నాయని, వీటికి గట్టి అడ్డుకట్ట వేయాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 24 గంటల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి, ప్యాట్రోలింగ్ పెంచాలని డిమాండ్ చేశారు.

నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పూర్తి రక్షణ కల్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే మందు, డబ్బు పంపిణీని పూర్తిగా అడ్డుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎడ్ల మహాలింగం, రమేష్ చారి, సూరయ్య, మణిల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News