ఆధిపత్య రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి నార్కట్పల్లి ఎస్సైకి వినతి
ఆధిపత్య రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి నార్కట్పల్లి ఎస్సైకి వినతి
స్థానికం బృందం
నార్కట్పల్లి, స్థానికం ప్రధాన ప్రతినిధి
నార్కట్పల్లి పట్టణంలోని వెడ్డింగ్ హాల్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు శాంతియుతంగా జరగేలా చర్యలు తీసుకోవాలని నార్కట్పల్లి నూతన ఎస్సైకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయనను సన్మానించారు.ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో గ్రామాల్లో కుల, రాజకీయ ఆధిపత్యాలు పెరుగుతున్నాయని, వీటికి గట్టి అడ్డుకట్ట వేయాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 24 గంటల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి, ప్యాట్రోలింగ్ పెంచాలని డిమాండ్ చేశారు.
నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పూర్తి రక్షణ కల్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే మందు, డబ్బు పంపిణీని పూర్తిగా అడ్డుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎడ్ల మహాలింగం, రమేష్ చారి, సూరయ్య, మణిల్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి