Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:44 AM

విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల

విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల

విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల
April 10, 2026 09:08 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 10న వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రతినిధి వివరాల ప్రకారం కళాశాల ప్రిన్సిపల్ అరుణ బాయ్ అధ్యక్షత వహించగా మునిసిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్ ముఖ్య అతిథిగా, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో అరుణ బాయ్ వార్షిక నివేదికను సమర్పిస్తూ ఈ విద్యా సంవత్సరంలో కళాశాల సాధించిన పురోగతి, అధ్యాపకులు మరియు విద్యార్థుల విజయాలను వివరించారు. సీపీగెట్ 2025లో వృక్షశాస్త్ర విభాగం నుండి మొదటి స్థానం సాధించిన విద్యార్థిని అఖిలను ప్రత్యేకంగా సన్మానించారు. రాజేష్ కుమార్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందడం, సుప్రభా మరియు మరో అధ్యాపకుడు పీహెచ్‌డీ పట్టాలు పొందడం వంటి విజయాలను ప్రస్తావించారు. కళాశాల అభివృద్ధికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మరమ్మతుల కోసం సుమారు ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు కేటాయించగా, నిర్మల జగ్గారెడ్డి తమ నిధుల నుండి నాలుగు కోట్ల రూపాయలు వసతి గృహ నిర్మాణానికి మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వనిత సంతోష్ మాట్లాడుతూ ఆడపిల్లల ఉన్నత విద్య సమాజ ప్రగతికి ఎంతో అవసరమని పేర్కొనగా, నాగేశ్వరరావు విద్యార్థినులు డిగ్రీ అనంతరం గ్రూపు పరీక్షలు రాసి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News