Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:56 PM

9వ రోజుకు చేరిన సహకార సంఘాల ఉద్యోగుల నిరవధిక సమ్మె డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలంటూ తిరువూరులో ఉధృత ఆందోళనలు

9వ రోజుకు చేరిన సహకార సంఘాల ఉద్యోగుల నిరవధిక సమ్మె డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలంటూ తిరువూరులో ఉధృత ఆందోళనలు

9వ రోజుకు చేరిన సహకార సంఘాల ఉద్యోగుల నిరవధిక సమ్మె డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలంటూ తిరువూరులో ఉధృత ఆందోళనలు
February 24, 2026 03:36 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: సహకార సంఘాల ఉద్యోగుల నిరవధిక సమ్మె మంగళవారం తొమ్మిదవ రోజుకు చేరుకోవడంతో తిరువూరులో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ ఉద్యోగులు కార్యాలయాల ఎదుట నిరసనలు కొనసాగిస్తున్నారు. నినాదాలతో ప్రాంతం మార్మోగింది. ప్రధానంగా జీవో నెంబర్ 36ను తక్షణమే అమలు చేయాలని, 2019 నుంచి 2024 వరకూ పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలను వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

చట్టప్రకారం గ్రాట్యుటీ చెల్లింపులు చేయాలని, ఉద్యోగ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని వారు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత, వృద్ధాప్య భద్రతపై అనిశ్చితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా, ఉద్యోగులకు కనీసం రూ.5 లక్షలకు తగ్గకుండా ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని కోరారు. 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డివిడెండ్లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. “సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగుతుంది” అని ఉద్యోగుల ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. సమ్మె దీర్ఘకాలం కొనసాగితే సహకార రంగంపై ప్రభావం పడే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News