50 ఏళ్ల సేవలకు అభినందనలు: ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్: స్థానికం ప్రతినిధి
నకిరేకల్ పట్టణంలోని శ్రీ కృష్ణా నర్సింగ్ హోమ్ 50వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 50 ఏళ్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ విశ్వాసాన్ని చాటుకుంటున్న శ్రీ కృష్ణా నర్సింగ్ హోమ్ సేవలు అభినందనీయమని అన్నారు. ఆరోగ్య రంగంలో అంకితభావంతో పనిచేస్తున్న ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బందిని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజారోగ్య పరిరక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు చేరువగా ఉండాలని ఆకాంక్షించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి