Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:01 AM

42 ఏళ్ల సేవలకు వీడ్కోలు – ఉపాధ్యాయుడు గుత్తా రామ్మోహన్ ఘన సన్మానం

42 ఏళ్ల సేవలకు వీడ్కోలు – ఉపాధ్యాయుడు గుత్తా రామ్మోహన్ ఘన సన్మానం

42 ఏళ్ల సేవలకు వీడ్కోలు – ఉపాధ్యాయుడు గుత్తా రామ్మోహన్ ఘన సన్మానం
13-04-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chakipalli
Mouli

నల్లగొండ, చిట్యాల:

గత 42 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో విశిష్ట సేవలు అందించి ఎన్నో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన గెజిటెడ్ ఉపాధ్యాయుడు గుత్తా రామ్మోహన్ ఉద్యోగ విరమణ పొందారు. చిట్యాల మండలం నేరడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సేవలందించిన ఆయన, తన సేవల కాలంలో మండల, జిల్లా స్థాయిలలో ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నారు.

మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుడిగా తన బోధనతో విద్యార్థుల్లో పటిష్టమైన పునాది వేసి, విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. నేరడ గ్రామంలో సుమారు రెండున్నర సంవత్సరాలు గణిత ఉపాధ్యాయుడిగా సేవలందించి అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దారు.

ఉద్యోగ విరమణ సందర్భంగా నల్లగొండ పట్టణంలో ఆయనకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి మమత, కుమారుడు సాయి, బంధుమిత్రులు, తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు పాల్గొని అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, “గుత్తా రామ్మోహన్ చేసిన సేవలు మరువలేనివి. ఉద్యోగ విరమణ అనంతరం ఆయన జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా కొనసాగాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.

Sthanikam

42 ఏళ్ల సేవలకు వీడ్కోలు – ఉపాధ్యాయుడు గుత్తా రామ్మోహన్ ఘన సన్మానం

Article Image

నల్లగొండ, చిట్యాల:

గత 42 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో విశిష్ట సేవలు అందించి ఎన్నో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన గెజిటెడ్ ఉపాధ్యాయుడు గుత్తా రామ్మోహన్ ఉద్యోగ విరమణ పొందారు. చిట్యాల మండలం నేరడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సేవలందించిన ఆయన, తన సేవల కాలంలో మండల, జిల్లా స్థాయిలలో ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నారు.

మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుడిగా తన బోధనతో విద్యార్థుల్లో పటిష్టమైన పునాది వేసి, విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. నేరడ గ్రామంలో సుమారు రెండున్నర సంవత్సరాలు గణిత ఉపాధ్యాయుడిగా సేవలందించి అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దారు.

ఉద్యోగ విరమణ సందర్భంగా నల్లగొండ పట్టణంలో ఆయనకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి మమత, కుమారుడు సాయి, బంధుమిత్రులు, తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు పాల్గొని అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, “గుత్తా రామ్మోహన్ చేసిన సేవలు మరువలేనివి. ఉద్యోగ విరమణ అనంతరం ఆయన జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా కొనసాగాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News