42 ఏళ్ల సేవలకు వీడ్కోలు – ఉపాధ్యాయుడు గుత్తా రామ్మోహన్ ఘన సన్మానం
42 ఏళ్ల సేవలకు వీడ్కోలు – ఉపాధ్యాయుడు గుత్తా రామ్మోహన్ ఘన సన్మానం
Mouli
నల్లగొండ, చిట్యాల:
గత 42 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో విశిష్ట సేవలు అందించి ఎన్నో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన గెజిటెడ్ ఉపాధ్యాయుడు గుత్తా రామ్మోహన్ ఉద్యోగ విరమణ పొందారు. చిట్యాల మండలం నేరడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సేవలందించిన ఆయన, తన సేవల కాలంలో మండల, జిల్లా స్థాయిలలో ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నారు.
మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుడిగా తన బోధనతో విద్యార్థుల్లో పటిష్టమైన పునాది వేసి, విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. నేరడ గ్రామంలో సుమారు రెండున్నర సంవత్సరాలు గణిత ఉపాధ్యాయుడిగా సేవలందించి అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దారు.
ఉద్యోగ విరమణ సందర్భంగా నల్లగొండ పట్టణంలో ఆయనకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి మమత, కుమారుడు సాయి, బంధుమిత్రులు, తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు పాల్గొని అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, “గుత్తా రామ్మోహన్ చేసిన సేవలు మరువలేనివి. ఉద్యోగ విరమణ అనంతరం ఆయన జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా కొనసాగాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి