Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:38 AM

24న జరిగే బందును జయప్రదం చేయాలి – సిపిఐ

24న జరిగే బందును జయప్రదం చేయాలి – సిపిఐ

24న జరిగే బందును జయప్రదం చేయాలి – సిపిఐ
January 21, 2026 03:52 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

ఆదోని జిల్లా సాధనకు సిపిఐ సంపూర్ణ మద్దతు

ఆదోని, స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆదోని జిల్లా సాధన ఉద్యమానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న బందులో ప్రత్యక్ష పోరాటానికి దిగేందుకు సిపిఐ సిద్ధంగా ఉందని పార్టీ నేతలు స్పష్టం చేశారు.భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు బుధవారం స్థానిక భీమాస్ హాల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి యు.లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించగా, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి టి.వీరేష్ మాట్లాడుతూ, ఆదోని జిల్లా సాధన అనేది ప్రజల చిరకాల ఆకాంక్ష అని, ఈ ఉద్యమంలో సిపిఐ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు. జిల్లా సాధన కోసం అన్ని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఐక్యంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు.ఆదోని ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక జిల్లా అవసరం అనివార్యమని, ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజల భావోద్వేగాలను గుర్తించి ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 24న నిర్వహించనున్న బందును విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచించారు.బందును శాంతియుతంగా, కానీ దృఢంగా నిర్వహించాలని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఆదోని జిల్లా సాధన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులు కోరారు.

ఈ సమావేశంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి కె.రమేష్ కుమార్, సిపిఐ న్యూగాంధీనగర్ శాఖ కార్యదర్శి ఏ.విజయ్ కుమార్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్, సహాయ కార్యదర్శి కె.లింగప్ప, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు శ్రీకాంత్, మరాఠి శాఖ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News