Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:30 AM

12వ వార్డు 'హస్తం' అభ్యర్థిగా పాక చిరంజీవి

12వ వార్డు 'హస్తం' అభ్యర్థిగా పాక చిరంజీవి

12వ వార్డు 'హస్తం' అభ్యర్థిగా పాక చిరంజీవి
30-01-2026 190 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మద్దతు.. కార్యకర్తల్లో ఉత్సాహం

చౌటుప్పల్ మున్సిపాలిటీ

ఎన్నికల్లో భాగంగా 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాక చిరంజీవి బరిలోకి దిగారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో ఆయన తన నామినేషన్ ను ఖరారు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన పార్టీ సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రత్యేక ప్రోత్సాహం అందించిన చౌటుప్పల్ రామాలయ చైర్మన్ బొబ్బిళ్ల మురళి కి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వార్డు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు. వార్డులోని ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో పాటు పార్టీ శ్రేణుల ఐక్యతతో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

12వ వార్డు 'హస్తం' అభ్యర్థిగా పాక చిరంజీవి

Article Image

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మద్దతు.. కార్యకర్తల్లో ఉత్సాహం

చౌటుప్పల్ మున్సిపాలిటీ

ఎన్నికల్లో భాగంగా 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాక చిరంజీవి బరిలోకి దిగారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో ఆయన తన నామినేషన్ ను ఖరారు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన పార్టీ సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రత్యేక ప్రోత్సాహం అందించిన చౌటుప్పల్ రామాలయ చైర్మన్ బొబ్బిళ్ల మురళి కి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వార్డు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు. వార్డులోని ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో పాటు పార్టీ శ్రేణుల ఐక్యతతో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News