12 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి
12 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి
K.RAVI
పాక చిరంజీవి యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చౌటుప్పల్ మున్సిపాలిటీ
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి కె రవి
చౌటుప్పల్ మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను ఆశీర్వదించండి వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాను అని పాక చిరంజీవి యాదవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యావంతుడిని రాజకీయంలో అనుభవం ఉన్న వ్యక్తిని గతంలో చౌటుప్పల్ ఉపసర్పంచిగా చేశాను, అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చుపిస్తాను అని అన్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నాను, నాకు అవకాశం కల్పిస్తే 12వ వార్డు కు అత్యధికంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాను అని అన్నారు. 12వ వార్డులో సమస్యలపై పూర్తి అవగాహన ఉంది, ముఖ్యంగా డ్రైనేజీ సమస్య, పారిశుద్ధం సమస్యలు 12వ వార్డ్ ను వెంటాడుతున్నాయి వాటిని పూర్తిగా పరిష్కరిస్తాను అని అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 20కి 20 అభ్యర్థులు గెలిపిస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తో అభివృద్ధి తొందరగా జరుగుతుంది అని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలో లేవని, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం, నూతన రేషన్ కార్డులు కానీ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి 10 లక్షలకు పెంచడం, పేద ప్రజలకు రేషన్ సన్న బియ్యం ఇవ్వడం కానీ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అర్హుడైన ప్రతి పేదవాడికి అందుతున్నాయి అని అన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి