Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:25 PM

12 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి

12 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి

12 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి
January 28, 2026 07:35 PM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పాక చిరంజీవి యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చౌటుప్పల్ మున్సిపాలిటీ

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి కె రవి

చౌటుప్పల్ మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను ఆశీర్వదించండి వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాను అని పాక చిరంజీవి యాదవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యావంతుడిని రాజకీయంలో అనుభవం ఉన్న వ్యక్తిని గతంలో చౌటుప్పల్ ఉపసర్పంచిగా చేశాను, అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చుపిస్తాను అని అన్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నాను, నాకు అవకాశం కల్పిస్తే 12వ వార్డు కు అత్యధికంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాను అని అన్నారు. 12వ వార్డులో సమస్యలపై పూర్తి అవగాహన ఉంది, ముఖ్యంగా డ్రైనేజీ సమస్య, పారిశుద్ధం సమస్యలు 12వ వార్డ్ ను వెంటాడుతున్నాయి వాటిని పూర్తిగా పరిష్కరిస్తాను అని అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 20కి 20 అభ్యర్థులు గెలిపిస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తో అభివృద్ధి తొందరగా జరుగుతుంది అని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలో లేవని, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం, నూతన రేషన్ కార్డులు కానీ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి 10 లక్షలకు పెంచడం, పేద ప్రజలకు రేషన్ సన్న బియ్యం ఇవ్వడం కానీ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అర్హుడైన ప్రతి పేదవాడికి అందుతున్నాయి అని అన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News