10 కిలోమీటర్ల దూరంలోనే 15 ప్రమాదకర మలుపులు.. ఎవరిది బాధ్యత?
10 కిలోమీటర్ల దూరంలోనే 15 ప్రమాదకర మలుపులు.. ఎవరిది బాధ్యత?
Editor Desk
రామన్నపేట–అమ్మనబోలు రోడ్డుపై వరుస ప్రమాదాలకు మలుపులే కారణమా?
సూచికలు లేవు.. వేగ నియంత్రణ లేదు
10 కిలోమీటర్ల రహదారిలో 15 మలుపులు
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట నుంచి అమ్మనబోలు వెళ్లే ప్రధాన రహదారిపై పలు చోట్ల మలుపులు ప్రమాదకరంగా మారాయి. రహదారి అనేక ప్రాంతాల్లో ఒకే వైపు వాలిగా ఉండటంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అయినా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధానంగా రామన్నపేట నుంచి మునిపంపుల వరకు ఈ సమస్య తీవ్రంగా ఉంది. కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే 15కు పైగా ప్రమాదకర మలుపులు ఉండటం రహదారి దుస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. మలుపుల వద్ద పెరిగిపోయిన ముళ్లపొదలు, చెట్లు ఎదురుదెరుగా వచ్చే వాహనాలు కనిపించకుండా చేస్తున్నాయి. దీంతో పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని వాహనదారులు చెబుతున్నారు.అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన ప్రమాద సూచిక బోర్డులు, వేగ నియంత్రికలు ఎక్కడా కనిపించడం లేదు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి మలుపుల వద్ద చెట్ల తొలగింపు, సూచిక బోర్డులు, వేగ నియంత్రికలు ఏర్పాటు చేయాలని, ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి