Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:03 PM

10 కిలోమీటర్ల దూరంలోనే 15 ప్రమాదకర మలుపులు.. ఎవరిది బాధ్యత?

10 కిలోమీటర్ల దూరంలోనే 15 ప్రమాదకర మలుపులు.. ఎవరిది బాధ్యత?

10 కిలోమీటర్ల దూరంలోనే 15 ప్రమాదకర మలుపులు.. ఎవరిది బాధ్యత?
January 18, 2026 11:13 AM 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట–అమ్మనబోలు రోడ్డుపై వరుస ప్రమాదాలకు మలుపులే కారణమా?
సూచికలు లేవు.. వేగ నియంత్రణ లేదు
10 కిలోమీటర్ల రహదారిలో 15 మలుపులు
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట నుంచి అమ్మనబోలు వెళ్లే ప్రధాన రహదారిపై పలు చోట్ల మలుపులు ప్రమాదకరంగా మారాయి. రహదారి అనేక ప్రాంతాల్లో ఒకే వైపు వాలిగా ఉండటంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అయినా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రధానంగా రామన్నపేట నుంచి మునిపంపుల వరకు ఈ సమస్య తీవ్రంగా ఉంది. కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే 15కు పైగా ప్రమాదకర మలుపులు ఉండటం రహదారి దుస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. మలుపుల వద్ద పెరిగిపోయిన ముళ్లపొదలు, చెట్లు ఎదురుదెరుగా వచ్చే వాహనాలు కనిపించకుండా చేస్తున్నాయి. దీంతో పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని వాహనదారులు చెబుతున్నారు.అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన ప్రమాద సూచిక బోర్డులు, వేగ నియంత్రికలు ఎక్కడా కనిపించడం లేదు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి మలుపుల వద్ద చెట్ల తొలగింపు, సూచిక బోర్డులు, వేగ నియంత్రికలు ఏర్పాటు చేయాలని, ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News