ఉగ్రవాదంపై ఉక్కుపాదం
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
Biksham Goud
‘ప్రహార్’ విధానాన్ని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం
దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక సమగ్ర విధానం ‘ప్రహార్’ను కేంద్రం ఆవిష్కరించింది. సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న జిహాదీ ముఠాలు, అంతర్జాల దాడులు, డ్రోన్ల ద్వారా జరుగుతున్న అక్రమ రవాణా, సంకేత నాణేల వినియోగం, జీవ మరియు అణు పదార్థాల దుర్వినియోగం వంటి సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ విధానాన్ని రూపొందించినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.
ఉగ్రదాడులను ముందస్తుగా గుర్తించి అరికట్టేందుకు పలు సంస్థలను సమన్వయం చేసి పనిచేయించనున్నారు. సమాచార సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, ఇంటెలిజెన్స్ బ్యూరోలో సంయుక్త కార్యదళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
దేశ భద్రతపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ప్రహార్’ విధానం అమలుతో ఉగ్రవాదానికి కట్టడి పడుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి