Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 04:13 AM

ఉగ్రవాదంపై ఉక్కుపాదం

ఉగ్రవాదంపై ఉక్కుపాదం

ఉగ్రవాదంపై ఉక్కుపాదం
24-02-2026 184 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

‘ప్రహార్’ విధానాన్ని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం

దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక సమగ్ర విధానం ‘ప్రహార్’ను కేంద్రం ఆవిష్కరించింది. సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న జిహాదీ ముఠాలు, అంతర్జాల దాడులు, డ్రోన్ల ద్వారా జరుగుతున్న అక్రమ రవాణా, సంకేత నాణేల వినియోగం, జీవ మరియు అణు పదార్థాల దుర్వినియోగం వంటి సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ విధానాన్ని రూపొందించినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.

ఉగ్రదాడులను ముందస్తుగా గుర్తించి అరికట్టేందుకు పలు సంస్థలను సమన్వయం చేసి పనిచేయించనున్నారు. సమాచార సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, ఇంటెలిజెన్స్ బ్యూరోలో సంయుక్త కార్యదళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

దేశ భద్రతపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ప్రహార్’ విధానం అమలుతో ఉగ్రవాదానికి కట్టడి పడుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.


Sthanikam

ఉగ్రవాదంపై ఉక్కుపాదం

Article Image

‘ప్రహార్’ విధానాన్ని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం

దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక సమగ్ర విధానం ‘ప్రహార్’ను కేంద్రం ఆవిష్కరించింది. సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న జిహాదీ ముఠాలు, అంతర్జాల దాడులు, డ్రోన్ల ద్వారా జరుగుతున్న అక్రమ రవాణా, సంకేత నాణేల వినియోగం, జీవ మరియు అణు పదార్థాల దుర్వినియోగం వంటి సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ విధానాన్ని రూపొందించినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.

ఉగ్రదాడులను ముందస్తుగా గుర్తించి అరికట్టేందుకు పలు సంస్థలను సమన్వయం చేసి పనిచేయించనున్నారు. సమాచార సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, ఇంటెలిజెన్స్ బ్యూరోలో సంయుక్త కార్యదళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

దేశ భద్రతపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ప్రహార్’ విధానం అమలుతో ఉగ్రవాదానికి కట్టడి పడుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News