Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:42 PM

ఉగ్రవాదంపై ఉక్కుపాదం

ఉగ్రవాదంపై ఉక్కుపాదం

ఉగ్రవాదంపై ఉక్కుపాదం
February 24, 2026 09:03 AM 174 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

‘ప్రహార్’ విధానాన్ని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం

దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక సమగ్ర విధానం ‘ప్రహార్’ను కేంద్రం ఆవిష్కరించింది. సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న జిహాదీ ముఠాలు, అంతర్జాల దాడులు, డ్రోన్ల ద్వారా జరుగుతున్న అక్రమ రవాణా, సంకేత నాణేల వినియోగం, జీవ మరియు అణు పదార్థాల దుర్వినియోగం వంటి సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ విధానాన్ని రూపొందించినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.

ఉగ్రదాడులను ముందస్తుగా గుర్తించి అరికట్టేందుకు పలు సంస్థలను సమన్వయం చేసి పనిచేయించనున్నారు. సమాచార సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, ఇంటెలిజెన్స్ బ్యూరోలో సంయుక్త కార్యదళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

దేశ భద్రతపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ప్రహార్’ విధానం అమలుతో ఉగ్రవాదానికి కట్టడి పడుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News