Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:58 AM

తిరుమలకు నో ఎంట్రీ’ ప్రచారం అవాస్తవం – TTD స్పష్టీకరణ

తిరుమలకు నో ఎంట్రీ’ ప్రచారం అవాస్తవం – TTD స్పష్టీకరణ

తిరుమలకు నో ఎంట్రీ’ ప్రచారం అవాస్తవం – TTD స్పష్టీకరణ
25-12-2025 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టోకెన్లు లేకున్నా దర్శనం ఉంటుంది – TTD ఛైర్మన్

స్థానికం ప్రతినిధి తిరుపతి

తిరుమలకు టోకెన్లు లేని భక్తులకు ప్రవేశం లేదంటూ సాగుతున్న ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. భక్తులు తిరుమలకు రావద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదని ఆయన తేల్చి చెప్పారు.

వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై స్పష్టత ఇచ్చిన ఆయన, తొలి మూడు రోజులు టోకెన్లు ఉన్న భక్తులకే ప్రత్యేక దర్శనం కల్పిస్తామని తెలిపారు. అయితే జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు టోకెన్లు లేకపోయినా ప్రతి భక్తుడికి దర్శన అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

గతంలో ఎదురైన అనుభవాలు, భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా, వాట్సాప్ వేదికగా వ్యాప్తి అవుతున్న వదంతులను నమ్మవద్దని భక్తులకు TTD సూచించింది.

తిరుమలలో దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని, భక్తులు ఎలాంటి సందేహాలకు లోనవ్వాల్సిన అవసరం లేదని ఛైర్మన్ స్పష్టం చేశారు.

Sthanikam

తిరుమలకు నో ఎంట్రీ’ ప్రచారం అవాస్తవం – TTD స్పష్టీకరణ

Article Image

టోకెన్లు లేకున్నా దర్శనం ఉంటుంది – TTD ఛైర్మన్

స్థానికం ప్రతినిధి తిరుపతి

తిరుమలకు టోకెన్లు లేని భక్తులకు ప్రవేశం లేదంటూ సాగుతున్న ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. భక్తులు తిరుమలకు రావద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదని ఆయన తేల్చి చెప్పారు.

వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై స్పష్టత ఇచ్చిన ఆయన, తొలి మూడు రోజులు టోకెన్లు ఉన్న భక్తులకే ప్రత్యేక దర్శనం కల్పిస్తామని తెలిపారు. అయితే జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు టోకెన్లు లేకపోయినా ప్రతి భక్తుడికి దర్శన అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

గతంలో ఎదురైన అనుభవాలు, భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా, వాట్సాప్ వేదికగా వ్యాప్తి అవుతున్న వదంతులను నమ్మవద్దని భక్తులకు TTD సూచించింది.

తిరుమలలో దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని, భక్తులు ఎలాంటి సందేహాలకు లోనవ్వాల్సిన అవసరం లేదని ఛైర్మన్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News