తిరుమలకు నో ఎంట్రీ’ ప్రచారం అవాస్తవం – TTD స్పష్టీకరణ
తిరుమలకు నో ఎంట్రీ’ ప్రచారం అవాస్తవం – TTD స్పష్టీకరణ
స్థానికం బృందం
టోకెన్లు లేకున్నా దర్శనం ఉంటుంది – TTD ఛైర్మన్
స్థానికం ప్రతినిధి తిరుపతి
తిరుమలకు టోకెన్లు లేని భక్తులకు ప్రవేశం లేదంటూ సాగుతున్న ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. భక్తులు తిరుమలకు రావద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదని ఆయన తేల్చి చెప్పారు.
వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై స్పష్టత ఇచ్చిన ఆయన, తొలి మూడు రోజులు టోకెన్లు ఉన్న భక్తులకే ప్రత్యేక దర్శనం కల్పిస్తామని తెలిపారు. అయితే జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు టోకెన్లు లేకపోయినా ప్రతి భక్తుడికి దర్శన అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
గతంలో ఎదురైన అనుభవాలు, భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా, వాట్సాప్ వేదికగా వ్యాప్తి అవుతున్న వదంతులను నమ్మవద్దని భక్తులకు TTD సూచించింది.
తిరుమలలో దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని, భక్తులు ఎలాంటి సందేహాలకు లోనవ్వాల్సిన అవసరం లేదని ఛైర్మన్ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి