PRINT TIME: March 24, 2026 09:11 PM
తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కు పెంపు
తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కు పెంపు
March 24, 2026 06:48 PM
20 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. జనాభా లెక్కలను 2027 మార్చి నాటికి పూర్తి చేసి, ఆ నివేదిక ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రక్రియలో భాగంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 179కు పెంచే అవకాశం ఉందని సమాచారం. అలాగే లోక్సభ స్థానాలను 17 నుండి 26కు పెంచే ప్రతిపాదన ఉన్నట్లు తెలిసింది. ఇక ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలను 175 నుండి 263కు పెంచే అవకాశం ఉందని, లోక్సభ స్థానాలను 25 నుండి 38కు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి