Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:54 AM

తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కు పెంపు

తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కు పెంపు

తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు  179కు పెంపు
March 24, 2026 06:48 PM 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. జనాభా లెక్కలను 2027 మార్చి నాటికి పూర్తి చేసి, ఆ నివేదిక ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రక్రియలో భాగంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 179కు పెంచే అవకాశం ఉందని సమాచారం. అలాగే లోక్‌సభ స్థానాలను 17 నుండి 26కు పెంచే ప్రతిపాదన ఉన్నట్లు తెలిసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలను 175 నుండి 263కు పెంచే అవకాశం ఉందని, లోక్‌సభ స్థానాలను 25 నుండి 38కు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News