స్థానికం విజయ ప్రస్థానంలో మరో మైలురాయి! 60,000 మంది కుటుంబానికి స్వాగతం...!!!
స్థానికం విజయ ప్రస్థానంలో మరో మైలురాయి! 60,000 మంది కుటుంబానికి స్వాగతం...!!!
Editor Desk
ఎడిటర్స్ డెస్క్ తరుపున:
ఒక చిన్న ఆలోచనగా మొదలైన 'స్థానికం', నేడు 60,000 మంది పాఠకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఈ విజయం మాది కాదు, నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిజాన్ని ఆదరించిన మీది!
మా వార్తలపై మీరు చూపిస్తున్న ఆసక్తి, మా విశ్లేషణలపై మీరు ఉంచిన నమ్మకమే మాకు నిజమైన శక్తి. 60 వేల మంది పాఠకులు మా వెంటే ఉన్నారన్న ధైర్యంతో, ప్రజా సమస్యలపై మా గొంతుకను మరింత గట్టిగా వినిపిస్తాం.
ఈ ప్రయాణంలో మాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
రిపోర్టర్స్ అండ్ స్థానికం బృందం తరుపున:
నిజం నిలకడగా ఉన్నా.. ప్రజల ఆదరణ దానికి ఎప్పుడూ ఉంటుందని మరోసారి రుజువైంది. నిష్పక్షపాత వార్తా కథనాలతో, ప్రజల పక్షాన నిలుస్తూ ప్రారంభమైన 'స్థానికం' న్యూస్ పోర్టల్ నేడు 60,000 (60K) మంది పాఠకుల మైలురాయిని అధిగమించింది.
కేవలం వార్తలను అందించడమే కాకుండా, సామాజిక బాధ్యతతో మేము వేస్తున్న ప్రతి అడుగుకు పాఠకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంత తక్కువ సమయంలో 60 వేల మందికి చేరువవ్వడం మాపై ఉన్న బాధ్యతను మరింత పెంచింది.
మాపై నమ్మకం ఉంచిన పాఠక దేవుళ్లకు, మాకు సహకరిస్తున్న శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపై కూడా మరింత వేగంగా, కచ్చితమైన సమాచారంతో మీ ముందుకు వస్తామని మాటిస్తున్నాం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి