Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:49 AM

రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
March 04, 2026 04:51 PM 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాబోయే తీవ్రమైన వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఏప్రిల్ నెలలోనే పంపిణీ చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు రాసి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు తీవ్రంగా ఉండటంతో పాటు, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఎండల తీవ్రత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, అలాగే తరచుగా రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో లబ్ధిదారులు ఒకేసారి మూడు నెలల సరఫరా పొందే అవకాశం కలగనుంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News