PRINT TIME: July 11, 2026 01:49 AM
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
March 04, 2026 04:51 PM
117 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాబోయే తీవ్రమైన వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఏప్రిల్ నెలలోనే పంపిణీ చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు రాసి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు తీవ్రంగా ఉండటంతో పాటు, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఎండల తీవ్రత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, అలాగే తరచుగా రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో లబ్ధిదారులు ఒకేసారి మూడు నెలల సరఫరా పొందే అవకాశం కలగనుంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి