రీఛార్జ్ ముగిసినా ఇన్కమింగ్ ఆపొద్దు: ఎంపీ రాఘవ్ చద్దా
రీఛార్జ్ ముగిసినా ఇన్కమింగ్ ఆపొద్దు: ఎంపీ రాఘవ్ చద్దా
GADDAM JAGANMOHAN REDDY
న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తూ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. మంత్లీ ప్లాన్ల పేరుతో టెలికాం సంస్థలు 28 రోజుల రీఛార్జ్ విధానం అమలు చేస్తూ వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నాయని ఆయన విమర్శించారు. సంవత్సరానికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి వస్తోందని పేర్కొన్నారు.
రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్కమింగ్ కాల్స్ను నిలిపివేయడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ముఖ్యంగా బ్యాంక్ ఓటీపీలు, అత్యవసర కాల్స్ అందకుండా పోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రీఛార్జ్ ముగిసినా కనీసం ఒక సంవత్సరం పాటు ఇన్కమింగ్ కాల్స్ మరియు ఓటీపీ సేవలను కొనసాగించేలా నిబంధనలు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అలాగే వినియోగదారు నంబర్ను మూడు సంవత్సరాల వరకు డీయాక్టివేట్ చేయకూడదని కూడా డిమాండ్ చేశారు.
ప్రస్తుతం మొబైల్ ఫోన్ విలాస వస్తువు కాదని, సామాన్య ప్రజల రోజువారీ జీవన విధానంలో కీలక భాగమైందని రాఘవ్ చద్దా స్పష్టం చేశారు. టెలికాం సంస్థలు వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సరైన విధానాలు అమలు చేయాలని ఆయన సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి