Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:59 PM

రీఛార్జ్ ముగిసినా ఇన్‌కమింగ్ ఆపొద్దు: ఎంపీ రాఘవ్ చద్దా

రీఛార్జ్ ముగిసినా ఇన్‌కమింగ్ ఆపొద్దు: ఎంపీ రాఘవ్ చద్దా

రీఛార్జ్ ముగిసినా ఇన్‌కమింగ్ ఆపొద్దు: ఎంపీ రాఘవ్ చద్దా
March 11, 2026 08:45 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తూ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. మంత్లీ ప్లాన్ల పేరుతో టెలికాం సంస్థలు 28 రోజుల రీఛార్జ్ విధానం అమలు చేస్తూ వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నాయని ఆయన విమర్శించారు. సంవత్సరానికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి వస్తోందని పేర్కొన్నారు.

రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్‌కమింగ్ కాల్స్‌ను నిలిపివేయడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ముఖ్యంగా బ్యాంక్ ఓటీపీలు, అత్యవసర కాల్స్ అందకుండా పోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రీఛార్జ్ ముగిసినా కనీసం ఒక సంవత్సరం పాటు ఇన్‌కమింగ్ కాల్స్ మరియు ఓటీపీ సేవలను కొనసాగించేలా నిబంధనలు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అలాగే వినియోగదారు నంబర్‌ను మూడు సంవత్సరాల వరకు డీయాక్టివేట్ చేయకూడదని కూడా డిమాండ్ చేశారు.

ప్రస్తుతం మొబైల్ ఫోన్ విలాస వస్తువు కాదని, సామాన్య ప్రజల రోజువారీ జీవన విధానంలో కీలక భాగమైందని రాఘవ్ చద్దా స్పష్టం చేశారు. టెలికాం సంస్థలు వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సరైన విధానాలు అమలు చేయాలని ఆయన సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News