Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:47 PM

పంచాయతీ కార్యదర్శి నుంచి DSP దాకా..

పంచాయతీ కార్యదర్శి నుంచి DSP దాకా..

పంచాయతీ కార్యదర్శి నుంచి DSP దాకా..
February 14, 2026 05:05 AM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

తండ్రి కలను సాకారం చేసిన మధు చరణ్!

కాకినాడ, : "సర్కారు బడిలో చదివితే ఏం సాధిస్తారు?" అని ఈసడించుకునే వారికి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామానికి చెందిన మధు చరణ్ తన విజయంతో సమాధానం చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు తండ్రి అప్పారావుకుమారుడు, గ్రూప్-1 పరీక్షలో సివిల్ DSP పోస్టుకు ఎంపికై అసాధారణ విజయంసాధించాడు. ప్రభుత్వ బడి పునాది, కష్టసహనం, తండ్రి మార్గదర్శకత్వంతో ఈ యువకుడు గ్రామీణ యువతకు స్ఫూర్తి.

ప్రభుత్వపాఠశాలల్లోనే చదువు. తండ్రి అప్పారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గౌరవంతో ఉద్యోగం చేస్తూ, ఇద్దరు కుమారులను ఐదో తరగతి వరకు గ్రామ ప్రభుత్వ బడిలో, ఆతర్వాత ఏలేశ్వరం హైస్కూల్‌లో చదివించారు. ఆ పునాది మధు చరణ్‌ను 2013లో 10వతరగతిలో మండల టాపర్‌గా నిలబెట్టింది. "ప్రభుత్వ బడులు ప్రతిభకు అడుగుజాడ" అని నిరూపించాడు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్ లక్షల జీతాలు తలుపుతట్టాయి. కానీ మధు చరణ్ప్రజాసేవ వైపు మొహరు తిప్పాడు. సివిల్ సర్వెంట్ కావాలనే పట్టుదలతో ఢిల్లీ కోచింగ్ జాయిన్ అయ్యాడు. ఆర్థిక ఒత్తిళ్లు, భయాల మధ్య 2019లో సచివాలయ ఉద్యోగాల్లో గ్రేడ్-5 కార్యదర్శిగా ఎంపికై, అన్నదమ్ములిద్దరూ ఒకేసారి సత్తా చాటారు. పంచాయతీ కార్యదర్శిగా ఒడిదుడుకులు. ఇంటి పన్నుల వసూళ్లు, సర్వేలు, రాజకీయ వత్తిడి మధ్య పని. స్నేహితులు విదేశాల్లో, సాఫ్ట్‌వేర్‌లో భారీ ప్యాకేజీలు పొందగా, మధు చరణ్ ఊరి వీధుల్లో పింఛన్లు పంచుతూ తిరిగాడు. "ఇదేనా నీ చదువుకు గౌరవం?" అన్న చూపులు వచ్చినా వెనక్కాడలేదు. నిబద్ధతతో కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ సేవా పురస్కారం సాధించాడు. 2022లో కలను సాకారం చేసుకోవాలని ఉద్యోగానికి సెలవు పెట్టి హైదరాబాద్ చేరాడు. గ్రూప్-1 పరీక్షలో రాత్రింబవళ్లు పుస్తకాలతో గడిపి, లక్షలాది పోటీదారుల్లో 87 మంది సీట్లలో ఒకటి సాధించి DSPగా ఎంపికైంది. గ్రామ ప్రజలు గర్వపడుతున్నారు. "కష్టం నీదైతే విజయం నీ బానిస" అని నిరూపించాడు. నేటి యువతకు మధు చరణ్ స్ఫూర్తి. ప్రభుత్వ బడులు, ఉద్యోగాలు సాధ్యమేనని చూపించాడు. తండ్రి కలను సాకారం చేసిన కొడుకు రాబోయే రోజుల్లో పోలీస్ శాఖలోఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని ఆశ. గ్రామీణ యువత పట్టుదలకు ఉదాహరణ.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News